Telugu https://www.amaravativoice.com/Table/Telugu/ Sun, 28 Apr 2024 04:22:24 +0000 Joomla! - Open Source Content Management en-gb amaravati.voice@gmail.com (amaravativoice.com) ఏరువాక మీద సాక్షి విషప్రచారం...కోత కోసి సమాధానం చెప్పిన కలెక్టర్ https://www.amaravativoice.com/Telugu/2016-09-17-12-32-09 https://www.amaravativoice.com/Telugu/2016-09-17-12-32-09 collector yeruvaka 17092016 1

విషయం ఉన్నవాళ్ళు, వాళ్ళ  పనితోనే  సమాదానం  చెప్తారు... అర్ధం  కాలేదా  ? సచిన్ టెండూల్కర్  విమర్శకులకి , తన బ్యాట్ తోనే సమాదానం చెప్పేవాడు... విషయంలోకి  వస్తే, జూన్  20, 2016లో, నర్సాపురం మండలం చిట్టవరంలో, ప‌ద్మ‌శ్రీ మంగిన వెంక‌టేశ్వ‌ర‌రావు పొలంలో,  “ఏరువాక” కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు  ప్రారంభించారు. పొలంలో వరినాట్లు యంత్రం స్వయంగా నడిపి నాట్లు వేశారు.

ఇంకేముంది, ఎప్పటిలాగే విషప్రచారం  మొదలుపెట్టింది  “సాక్షి”... జనాలని  తప్పుదోవపట్టించి, అదోరకమైన  ఆనందం పొందింది.. దానికతోడు, కులపిచ్చ వెబ్ మీడియా...” నారుపోసి.. నీళ్లు మరిచి” అనే శీర్షికను  ఆగష్టు నెలలో ప్రచురించింది.. స్వయంగా చంద్రబాబు నాట్లు వేసిన పొలంలో నాట్లు ఎండిపోయి తుంగ గడ్డి మొలి చిందని ఒక ఐటెం రాసింది...

కట్ చేస్తే, సాక్షి అడ్డంగా దొరికిపోయింది... సాక్షి  రాసే  ప్రతి అక్షరం విషపు రాతలే, అని మరోసారి  రుజువైంది...ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాకలెక్టర్, నర్సాపురం MLA బండారు మాధవ నాయుడు స్వయంగా  ఆ పొలంలో వరిపంట కోత కోసి చూపించారు...చంద్రబాబు వరినాట్లు వేసిన పొలం, ఎంత పచ్చగా ఉందో చూపించారు...ఇప్పుడు మూడో పంటకు సిద్దమవుతుంది ఆ పొలం... 

ఏమి చేస్తాం, కొన్ని జీవితాలు అంతే , పచ్చగా ఉంటే చూడలేవు... అందుకే, సాక్షి గూబ గుయ్యిమనేలా సమాధానం చెప్పారు...

ఇంకా డౌట్ ఉంటే , ఈ ఫోటోలు చూడండి...

collector yeruvaka 17092016 2

collector yeruvaka 17092016 3

collector yeruvaka 17092016 4

]]>
amaravati.voice@gmail.com (Amaravati Voice) Telugu Sat, 17 Sep 2016 12:32:09 +0000
హరిత హారం అంటే ఎగబడ్డారు, వనం-మనం అంటే మొఖం చాటేశారు... https://www.amaravativoice.com/Telugu/tollywood-heros-skipping-vanam-manam https://www.amaravativoice.com/Telugu/tollywood-heros-skipping-vanam-manam tollywood heroes 29072016

హరిత హారం అంటే ఎగబడ్డారు, వనం-మనం అంటే మొఖం చాటేశారు...ఎవరి గురించి అనుకుంటున్నారా ? మన ఘనతవహించిన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ లు గురించి....అది హైదరాబాద్ మీద మోజో, లేక కెసిఆర్ అంటే భయమో, హరిత హారం అని తెలంగాణా ప్రభుత్వం పిలుపు ఇవ్వగానే, ఒక్కొక్కడు ఎగబడి, మొక్కలు నాటుతూ ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో షేర్ చేసి, లెక్చర్లు ఇచ్చారు..

సరే, మంచి పనికి సహకిరించారు, దాంట్లో తప్పేమీ ఉందిలే అనుకున్నాం...కాని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వనం-మనం అంటే, ఒక్కడు కాకపొతే, ఒక్కడు కుడా కన్నెత్తి ఇటు చూడలా...మరి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంటే చులకన భావామో, చంద్రబాబు అంటే లెక్కలేని తనమో...

వైజాగ్ లో స్టూడియో లు కట్టుకోవటానికి, ఫిలిం ఛాంబెర్లు ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావలి....అక్కడిదాకా ఎందుకు, వీళ్ళ సినిమాలు కలెక్షన్ రావాలి అంటే, ఆంధ్రావాడు కావాలి...ప్రభుత్వం ఒక సామాజిక కార్యక్రమానికి పిలుపు ఇస్తే, ఒక్కడు అంటే ఒక్కడు ముందుకు రాలేదు అంటే, వాళ్లకి కాదు, వాళ్ళను ఇంకా ఆదరించి, అభిమాన హీరోలుగా ఆరాధించే మనకు ఉండాలి...

ఎవ్వడు ముందుకి వచ్చినా, రాకపోయినా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి, తమ రాష్ట్రము పట్ల అభిమానం ఉంది...అందుకే ఇవాళ వాడవాడలా, పెద్ద, చిన్నా అందరం కలిసి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తీ చేసుకున్నాం...మీలాగా ఫోటోలు  సోషల్ మీడియాలో పెట్టుకోము, ఇంతటితో దులుపుకుని వెళ్లిపోము....ఆ మొక్కకి, మేమే రోజు నీళ్ళు పోస్తాం, దేగ్గరుండి పెంచుతాం, పెద్దది చేస్తాం, మా రాష్ట్రాని హరితాంధ్రప్రదేశ్ చేసుకుంటాం...మీ నాటకాలు మీరు హైదరాబాద్లో ఆడుకోండి టాలీవుడ్ హీరోలు..

]]>
amaravati.voice@gmail.com (Amaravati Voice) Telugu Fri, 29 Jul 2016 15:08:13 +0000
మహిమాన్విత పుణ్యక్షేత్రం 'మోపిదేవి' https://www.amaravativoice.com/Telugu/2016-07-11-16-59-47 https://www.amaravativoice.com/Telugu/2016-07-11-16-59-47 krishna pushkaralu 7 11072016

అనాదిగా ఆంధ్రప్రదేశంలో నాగారాధన ఉన్నదన్న విషయం అందరికి తెలుసు. ఆంధ్రప్రదేశానికి నాగభూమి అనే పేరు కూడా ఉన్నది. ముఖ్యంగా నేటి దివితాలూకా ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇదే విస్తీర్ణంలో కృష్ణకు ఉత్తర దిక్కుగా ఉన్న ప్రాంతం కూడా కలుపుకొని ఉన్న ప్రదేశాన్నంతా ఒకప్పడు నాగభూమిగా వ్యవహరించే వారు. స్థలపురాణం - ఇంద్రాది దేవతల ప్రార్థన మేరకు లోపా ముద్రతో కలసి అగస్త్య మహర్షి వారణాసి నుండి అయిష్టంగానే బయలు దేరి మేరువుతో సంఘర్షించి లోకోపద్రవము కలిగిస్తూ ఆకాశంలోకి చొచ్చుకొని పోయి సూర్యగమనాన్ని నిరోదించి వింధ్య పర్వతాన్ని చూచి తాను దక్షిణ దేశ పుణ్య తీర్థ యాత్రలకు వెళుతున్నాను కనుక నీవు కొంచెం తగ్గి వుంటే దక్షిణ దేశంలోకి ప్రవేశిస్తాను. మరల నేను వచ్చేంత వరకు ఆ విధంగానే వండమనగా మునిశక్తికి బయపడి వింధ్య పర్వతం తలొగ్గింది.

లోపాముద్ర సహితుడై అగస్యుడు దక్షిణావనిలో ప్రవేశించి అక్కడే వుండిపోయాడు. వింధ్య పర్వతానికి శాశ్వతంగా గర్వభంగం చేశాడు. దక్షిణ దేశంలో శిష్యులతో , భర్తతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణానది తీరంలోని కుమారక్షేత్రానికి (మోపిదేవి) వచ్చారు. తన దివ్యదృష్టితో దాని మహత్యాన్ని గాంచారు. పాములు ముంగీసలు కలిసి ఉన్నాయి. ఒక చోట దివ్వ తేజస్సుతో ప్రకాశించే పుట్టను చూశారు. ఒకానొక అల్పదోష పరిహారము కోసం సుబ్రహ్మణ్యస్వామి ఉరగ రూపమును ధరించి ఇక్కడ ఒక శ్రేష్టమైన వల్మీకంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ అంశం గ్రహించి సుబ్రమణ్యస్వామిని కొలిచి తరించవలెనని అనుకున్నాడు. తాను దివ్వదృష్టితో చూచిన ఈ విషయాన్ని తన వారితో చెప్పాడు. పడగవలే ఉండే శివలింగాన్ని ఆ పుట్టపై ప్రతిష్టించాడు. నాగకుమార ద్వయం ఏకరూపమై నిలిచిన పుణ్యక్షేత్రం ఇది.

మొట్టమొదటగా ఈ స్వామిని అర్పించినది మహర్షి అగస్త్యుల వారు. అగ్రస్త్య మహర్షి చేత పూజింపబడిన సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహత్యాన్ని అవగతం చేసుకున్నదేవతలు, మునులు తమ శక్త్యాను సారం స్వామి వారికి అర్చన విధులు గావించేవారు. ప్రశాంతమైన ఈ పుణ్యభూమిలో మునులు తపస్సు చేసుకోసాగారు.ఈ కాలంలో పుట్టకు గుడిలేదు. భక్తుల సందడి లేదు. లౌకికపు వైభవం లేదు. దేవతాది గణం చేత పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర లింగం కొన్నాళ్లు కాలగర్భంలో తన ఉనికిని విస్మరింపు చేసి పుట్టలోనే అంతర్గతంగా ఉంది.

పవిత్రమైన ఈ పుట్టకు దగ్గరలో కొంత మంది కుమ్మరులు నివాసం ఉండే వారు. వారిలో వీరారపు పర్వతాలు అనే వ్యక్తి మహాభక్తుడు. అతనికి స్వప్నంలో కుమారస్వామి కనపడి పుట్టలో నుండి లింగాన్ని తీసి ప్రతిష్టించమని ఆదేశించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని లింగ ప్రతిష్ట చేశాడు. తర్వాత తనకు తోచిన రీతిలో సుబ్రహ్మణ్యస్వామికి ప్రీతికరమైన వస్తువులను మృత్తికతో నేర్పుగా కాల్చి వాటిని శ్రీ స్వామి వారికి సమర్పిస్తూ ఉండేవాడు. గుర్రము , నంది, కోడి , గరుత్మంతుడు మొతలైన మట్టి విగ్రహాలు తయారు చేసి సమర్పించాడు. వాటిని ఈ నాటికి మన తరం కూడాచూడవచ్చు.

తర్వాతి కాలంలో దేవరకోట ప్రభుతువలు స్మామి వారి మహిమలు విని భక్తుల సహకారంతో ఆలయ మంతా పాదులు కట్టించి స్వామివారికి సేవలలో ఎలాంటి లోపాలు రాకుండా జాగ్రత్తగా తమ దేవాలయ పాలన గావించారు. ఇటీవల కాంలో మరల దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా దేవాదాయ శాఖ వారు తీర్చిదిద్దారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తూర్పు దిశగా ఉన్నది. గర్భగుడిలో ఆరు లేక ఏడు పాము చుల మీత (ఇదే పావనపట్టం) ఆశ్వరుటు (లింగం) ఉన్నాడు. ఈయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పావన పట్టం కింద అందరికి కనపడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంది. అర్చన అభిషేకాదులపుడు ఆ రంధ్రంలో పాలు పోస్తారు. ఆలయ ప్రదక్షణ మార్గంలో దక్షిణం వైపున ఉన్న పుట్ట నుండి గర్భగుడి లోకి లోపలి దారి ఉన్నట్లు భక్తుల విశ్వాసం. దేవతా సర్పం ఈ మార్గం గుండా పయనిస్తుంది. గర్భగుడిలో ఉన్న స్వామివారికి అత్యంత భక్తి శ్రద్దలతో అర్చకులు పూజా కార్యక్రమాలు , అభిషేకాలు చేస్తుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి భక్తులు అనేక విధాలుగా మొక్కుకుంటారు. చెవి పోగులు కుట్టిస్తారు. తలనీలాలు సమర్పిస్తారు. పొంగలి నివేదిస్తారు. కళ్యాణం జరిపిస్తారు. అన్న ప్రాసన , అక్షరాభ్యాసం , స్వామి వారి సన్నిధిలో జరిపించుకుంటారు. శ్రీ స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు , మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు , మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు , మహాన్యాస పూర్వ వారాభిషేకాలు శాస్తోకంగా నిర్వహిస్తుంటారు. మహిళల చీర మొక్కుబడులు , పిల్లల ఉయ్యాల ఊపు మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.

ఈ ఆలయానికి ఆగ్నేయ దిశగా స్వామి వారి కళ్యాణ మండపం ఉంది. దీనిని చల్లపల్లి రాజా వారి వంశస్థులు నిర్మించారు. కళ్యాణ మండప స్థంభము మీద ఉన్న శిలాఫలకం పై శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్, బహుదూర్ చల్లపల్లి రాజా వంశస్థులు , కోయంబతూరు వాస్తవ్యులు డి. జయవర్థన వేలు , వారి ధర్మపత్తి రాజ్యలక్ష్మి దంపతులచే భక్తి పూర్వకంగా సమర్పించబడినది.

]]>
amaravati.voice@gmail.com (Amaravati Voice) Telugu Mon, 11 Jul 2016 16:59:47 +0000
అమరావతికి అల్లంత దూరంలో…అదే వైకుంఠపురం https://www.amaravativoice.com/Telugu/2016-07-10-15-24-56 https://www.amaravativoice.com/Telugu/2016-07-10-15-24-56 krishna pushkaralu 6 10072016

పవిత్ర కృష్ణవేణి, ఉత్తరవాహినిగా పేరుగాంచి తీరం వెంబడి వున్న పుణ్యక్షేత్రాలో అత్యంత ప్రసిద్దమైన పుణ్యక్షేత్రంగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం పుష్కరయాత్రికులకు స్వాగతం పలుకుతోంది.

పూర్వం ఈ పుణ్యక్షేత్రాన్ని రావూరు అని పిలిచేవారు. కృష్ణానదికి ఆనుకుని క్రౌంచాద్రి అనే పర్వతం వుంది. శ్రీమన్నారాయణుడు భక్తులను తరింపజేయడానికి ఆ కొండపై కొలువుండి అక్కడకు వచ్చే ఆవుల పాలు తాగుతూ కొన్నాళ్లకు గ్రామంలోని ఒక బ్రాహ్మణోత్తమునకు కలలో కనిపించి క్రౌంచాద్రిపై తాను ఒక గుహలో కొలువై ఉన్నానని, గుహకు దగ్గరలో రావిచెట్టు వుంది, దాని వద్ద నేలను తవ్వినట్లయితే ద్రవ్యం దొరుకుతుంది. ఆ ధనముతో తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించినట్లు చెబుతారు.

స్వామివారి ఆజ్ఞప్రకారం గుహవద్ద తవ్వగా అక్కడ ధనం లభించింది. దానితో స్వామివారి గుహ వద్ద నుంచి కొండ దిగువ భాగానికి కొండరాళ్లను పగులగొట్టించి దారిచేయునపుడు, స్వామి వారు కనిపించి నేను ఈ పర్వతమందు ఆవహించియున్నారని , శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించినట్లు సెలవిచ్చారట.

అంతట బ్రాహ్మణుడు ఆ గుహనందు చూడగా నిరాకార ఆకారంలోగల శ్రీ స్వామివారిని తిలకించి విగ్రహరూపంలో స్వామివారిని మలిచారని , అక్కడ శిల్పులు ఉలిపెట్టి కొట్టగా ఆ ప్రదేశం నుంచి రక్తం కారిందని చెబుతారు. అంతట స్వామివారు బ్రాహ్మణునితో నేను నిరాకార నిరంజనుడను , నాకు ఆకారంతో పనిలేదు, నా వక్షస్థలంపై గాయపరిచినారు. కావున నిత్యం గాయంపై గంధము వుంచమని ఆజ్ఞాపించాడట. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు నిత్యం మంచి గంధం శ్రీ స్వామివారికి సమర్పిస్తున్నారు.

క్రౌంచాద్రి పర్వతం చుటూ 8 మంది ఆంజనేయులను ప్రతిష్టించి అష్టదిగ్గజము గావించారు. స్వామివారి సన్నిధిన ఉత్తరంగా కొండపైన కాలభైరవ క్షేత్రం వుంది. దీనికి దిగువన వున్న ఉత్తర వాహిని నందు గల పంచలింగములకు , స్వామివారికి దేవతలు , బుషులు , నిత్యం పూజలు జరుపుతారని ప్రతీతి. కృష్ణానది ఈ క్షేత్రం వద్ద ఉత్తరవాహినిగా పిలువబడుతోంది. ఈ క్షేత్రానికి మరోపేరు బంధవిరామ క్షేత్రం.

గోమాత నుంచి తన వృత్తాంతమును తెలుసుకుని పశ్చాత్తాపముతో పాప విముక్తి పొందుటకు ఈ వైకుంఠపురం పుణ్యక్షేత్రానికి వచ్చి ఉత్తరంగా ప్రవహించు కృష్ణవేణిలో స్నానమాచరించి వెంకటేశ్వరస్వామిని దర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరించగా వారికున్న బంధము విడిపోయింది. అందువలన ఈ క్షేత్రాన్ని బంధవిరామ క్షేత్రంగా పిలుస్తారు. వారి విగ్రహాలు క్రౌంచాద్రి పర్వతంపై ఒక గుహలో వున్నాయి.

ఈ క్షేత్రం అమరావతి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో విజయవాడ మార్గమధ్యంలో వుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి విజయవాడ నుంచి అమరావతికి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం కలదు.

]]>
amaravati.voice@gmail.com (Amaravati Voice) Telugu Sun, 10 Jul 2016 15:24:56 +0000
పుష్కరం ఎందుకు చేసుకుంటాం, దాని చరిత్ర ఏంటి ? https://www.amaravativoice.com/Telugu/2016-07-09-16-16-42 https://www.amaravativoice.com/Telugu/2016-07-09-16-16-42 krishna pushkaralu 5 09072016

పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని ఆర్ధం. భారతకాలమానం ప్రకారం భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆయా నదుల రాశిలలో ఉన్నంత కాలం ఆ నదిలో పుష్కరాలు ఉన్నట్లే లెక్క. ఒక సంవత్సరం కాలంపాటు బృహస్పతి ఆయా రాశులలో ఉండడం జరుగుతుంది. ఆ సందర్భాల్లో ప్రవేశించిన మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు, సంవత్సరాంతంలోని చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా పిలవడం జరుగుతుంది. మొదటి, చివరి 12 రోజులు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణించడం జరుగుతుంది.

పుష్కర అనే శబ్దానికి నీరు, వరుణుని కుమారుడు వంటి అనేక ఆర్థాలు ఉన్నాయి. పుష్కరాల ముఖ్య ఉద్దేశ్యం నది పర్యావరణ సంరక్షణ , పరిశుభ్రతను తెలుసుకునేందుకే పుష్కరాలను ఆచరించాలనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పెద్దలు పేర్కొన్నారు. నదీ తీరంలో ఎక్కడ మెరక ఉందో , ఎక్కడ పల్లం ఉందో , ఎక్కడ నదితీర ప్రాంతం కోతకు గురైందో, చెట్లు కొట్టివేసిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు గాను పూర్వికులు ఈ ఇటువంటి సంప్రదాయాన్ని ప్రారంభించి నది పవిత్రతను కాపాడేందుకు ఆయా నదులలో పున్యస్నానాలు ఆచరించడం ద్వారా నీటి వనరుల ప్రాముఖ్యాన్ని చేప్పకనే చాటి చెప్పారు. హిందు సనాతన ధర్మంలో నదులకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి పుజాదులు ఆచరించడం ద్వారా భవిష్యత్తరాలకు జలాల ప్రాముఖ్యాన్ని తీసుకువెళ్ళడమే ధ్యేయంగా పుష్కరాలను నిర్వహించడం జరుగుతుంది.

ఆయూ నదులలో బృహస్పతి ప్రవేశించే రాశుల వివరాలు:

గంగానదికి మేషరాశిలోను, నర్మదానదికి వృషభరాశి, సరస్వతీ నదికి మిధునరాశి, యమునానదికి కర్కాటరాశి, గోదావరి నదికి సింహరాశి, కృష్ణానదికి కన్యారాశి, కావేరి నదికి తులారాశి, భీమానదికి వృశ్చికరాశి, పుష్కరవాహిని/రాధ్యసాగనదికి ధనుర్రాశి, తుంగభద్ర నదికి మకరరాశి, సింధునదికి కుంభరాశి, ప్రాణహిత నదికి మీనరాశిలోను బృహస్పతి ప్రవేశకాలం నుండి పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది.

గత ఎడాది జూలై 14 నుండి జూలై 25 వరకు గోదావరి పుష్కరాలు బృహస్పతి, సింహరాశిలో ప్రవేశించిన సమయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎడాది కృష్ణా పుష్కరాలను బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే ఆగష్టు 12 నుంచి ఆగష్టు 23 వరకు 12 రోజుల పాటు ఆది పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే రోజు (ఆగష్టు 12 శుక్రవారం) హిందువులకు ఎంతో పవిత్రమైన వరలక్ష్మీవ్రతం పండుగ రావడం యాధృచ్చికం.

పుష్కరుని చరిత్ర:

 

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తప్పసు ఆచరించి ఈశ్వరుని ప్రసన్నంతో తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని ఈశ్వరుడు వరం ఇచ్చాడు. తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకాలని వరం కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తమ అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. ఇలా తుందిలుడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు ఆధిపతి అయ్యే వరాన్ని పొందాడు.తద్వారా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంసృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు.

బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోకి ప్రవేశించాడు.బ్రహ్మకార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవనాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు. ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు. కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు.

అప్పడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్నం సమయంలో రెండు ముహుర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించాడు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి ఆధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యపధమని పురాణాలు చెప్తున్నాయి.

పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని ఆర్ధం. భారతకాలమానం ప్రకారం భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆయా నదుల రాశిలలో ఉన్నంత కాలం ఆ నదిలో పుష్కరాలు ఉన్నట్లే లెక్క. ఒక సంవత్సరం కాలంపాటు బృహస్పతి ఆయా రాశులలో ఉండడం జరుగుతుంది. సందర్భాల్లో ప్రవేశించిన మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు, సంవత్సరాంతంలోని చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా పిలవడం జరుగుతుంది. మొదటి, చివరి 12 రోజులు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణించడం జరుగుతుంది.

పుష్కర అనే శబ్దానికి నీరు, వరుణుని కుమారుడు వంటి అనేక ఆర్థాలు ఉన్నాయి. పుష్కరాల ముఖ్య ఉద్దేశ్యం నది పర్యావరణ సంరక్షణ , పరిశుభ్రతను తెలుసుకునేందుకే పుష్కరాలను ఆచరించాలనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పెద్దలు పేర్కొన్నారు. నదీ తీరంలో ఎక్కడ మెరక ఉందో , ఎక్కడ పల్లం ఉందో , ఎక్కడ నదితీర ప్రాంతం కోతకు గురైందో, చెట్లు కొట్టివేసిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు గాను పూర్వికులు ఈ ఇటువంటి సంప్రదాయాన్ని ప్రారంభించి నది పవిత్రతను కాపాడేందుకు ఆయా నదులలో పున్యస్నానాలు ఆచరించడం ద్వారా నీటి వనరుల ప్రాముఖ్యాన్ని చేప్పకనే చాటి చెప్పారు. హిందు సనాతన ధర్మంలో నదులకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి పుజాదులు ఆచరించడం ద్వారా భవిష్యత్తరాలకు జలాల ప్రాముఖ్యాన్ని తీసుకువెళ్ళడమే ధ్యేయంగా పుష్కరాలను నిర్వహించడం జరుగుతుంది.

ఆయూ నదులలో బృహస్పతి ప్రవేశించే రాశుల వివరాలు:

గంగానదికి మేషరాశిలోను, నర్మదానదికి వృషభరాశి, సరస్వతీ నదికి మిధునరాశి, యమునానదికి కర్కాటరాశి, గోదావరి నదికి సింహరాశి, కృష్ణానదికి కన్యారాశి, కావేరి నదికి తులారాశి, భీమానదికి వృశ్చికరాశి, పుష్కరవాహిని/రాధ్యసాగనదికి ధనుర్రాశి, తుంగభద్ర నదికి మకరరాశి, సింధునదికి కుంభరాశి, ప్రాణహిత నదికి మీనరాశిలోను బృహస్పతి ప్రవేశకాలం నుండి పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది.

గత ఎడాది జూలై 14 నుండి జూలై 25 వరకు గోదావరి పుష్కరాలు బృహస్పతి, సింహరాశిలో ప్రవేశించిన సమయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎడాది కృష్ణా పుష్కరాలను బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే ఆగష్టు 12 నుంచి ఆగష్టు 23 వరకు 12 రోజుల పాటు ఆది పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే రోజు (ఆగష్టు 12 శుక్రవారం) హిందువులకు ఎంతో పవిత్రమైన వరలక్ష్మీవ్రతం పండుగ రావడం యాధృచ్చికం.

పుష్కరుని చరిత్ర:

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తప్పసు ఆచరించి ఈశ్వరుని ప్రసన్నంతో తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని ఈశ్వరుడు వరం ఇచ్చాడు. తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకాలని వరం కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తమ అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. ఇలా తుందిలుడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు ఆధిపతి అయ్యే వరాన్ని పొందాడు.తద్వారా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంసృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోకి ప్రవేశించాడు.బ్రహ్మకార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవనాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు. ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు. కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్నం సమయంలో రెండు ముహుర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించాడు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి ఆధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యపధమని పురాణాలు చెప్తున్నాయి.

]]>
amaravati.voice@gmail.com (Amaravati Voice) Telugu Sat, 09 Jul 2016 16:16:42 +0000
పుష్కరాల్లో పిండ ప్రధాన ప్రాముఖ్యత ఏంటో తెలుసా ? https://www.amaravativoice.com/Telugu/2016-07-08-15-44-03 https://www.amaravativoice.com/Telugu/2016-07-08-15-44-03 krishna pushkaralu 4 08072016

పుష్కర విధులు నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి. నదీ స్నానంతో పుణ్యం వస్తుంది. నీళ్ళతోనే అన్ని రోగాలు పోతాయనేది మన నమ్మకం. మన ఆత్మలన్నీ చివరకు పరమాత్మతో కలుస్తాయని చెప్పే పాఠమని ఈ నదీ ప్రవాహం. ఆత్మలన్నీ పరమాత్మలో కలవడమంటే మనం చేసే మంచి , చెడు పనులన్నీ చివరకు మనం ఉండే మన సమాజానికి ఉపయోగ పడటమే. నది మనకి తాగడానికి నీళ్లు ఇచ్చి, మంచి పంటల్ని పండించి జీవనాధారమై , మనందరి అవసరాల్ని తీరుస్తుంది.

ఇలాంటి నీళ్లని మనం దోసిళ్లలో తీసుకొని నీళ్ల స్వచ్ఛతని తెలుసుకుని ఎప్పటికి ఇలానే వుండేలా చూస్తామని ప్రతిజ్ఞ చేయడమే పుష్కర స్నానం. పిండ ప్రధానంలో మనం పితృదేవతల కోసం పూజ చేసి చివరికి బియ్యంతో ఉడికించిన పిండాల్ని నదీ నీళ్లలో వదుల్తాం. మన పితృదేవతలు మనల్ని వందేళ్లు ఆరోగ్యంగా ఉండమని దీవించాలని మనం కోరతాం. మనం రోగాలు లేకుండా ఆరోగ్యంగా వుండాలంటే పితృదేవతల రూపంలో నీళ్లలో వున్న చేపలు , తాబేళు , కప్పలకి పిండాల రూపంలో ఆహారాన్నిస్తాం.

నీళ్లలో పిండాల్ని వదలడమంటే మన పాపాల్ని అంటే రోగాల్ని పోగొట్టుకోవడానికి చేస్తే మంచి పని. మనం వదిలే పిండాలు నీళ్లలో వున్న చేపలు తినినీళ్లలోని మలినాల్ని, మురికిని తినేసి నీళ్లని శుభ్రంగా వుంచుతాయి. పుష్కరం పేరుతో మనం నీళ్లని మురికి చెయ్యకూడదు అనేదే పుష్కర సూత్రం. దైవ దర్శనం కోసం మనం గుడికి వెళ్తాం. గుడి అంటే ఒక శిఖరం , ఒక దేవుడి బొమ్మ కాదు.

గుడి, గుల్లో కొన్ని చెట్లు, గుడి దగ్గర్లో కోనేరు ఇవ్వన్నీ కలిస్తేనే దేవుడు , గుడి.ఇవన్నీ కలిస్తేనే పర్యావరణ సూత్రాన్ని, తత్వాన్ని చెప్తాయి. నీళ్లనిచ్చే చెరువుల్ని, బావుల్ని, కోనేరుల్ని కాపాడుకోవాలి. మంచి చెట్లు మన చుటూ వుండాలి. మందు మొక్కల్ని, వేప , ఉసిరి , రావి, మర్రి లాంటి చెట్లు ఉండేలా పెంచి కాపాడుకోవాలని మనకి చెప్తాయి మన దేవాలయాలు.

]]>
amaravati.voice@gmail.com (Amaravati Voice) Telugu Fri, 08 Jul 2016 15:44:03 +0000
విజయవాడకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? https://www.amaravativoice.com/Telugu/2016-07-07-15-41-15 https://www.amaravativoice.com/Telugu/2016-07-07-15-41-15 krishna pushkaralu 3 07072016

విజయవాడకి చరిత్రలో చాలా పేర్లు ఉన్నాయి . బిజియివాడు, విజయివాడ, బిజవాడ, బీజవాటిక, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, చోళరాజేంద్రపురం, చోళరాజేంద్ర విజయపురం, మల్లికార్జున మహాదేవపురం, విజయవాడ. ఇన్ని పేర్లు ఉన్నా చరిత్రలో చాలాకాలం బెజవాడగానే చలామణి అయింది.

ఆదిశంకరులు భగవాత్పాదులు భారతదేశమంతటా పర్యటించి, ప్రధాన ప్రదేశాలలో అష్టాదశ పీఠాలను స్థాపించి, శక్తి స్వరూపిణియైన జగధాంబను ప్రతిష్టించారు. ఆంధ్రప్రదేష్ లోని పిఠాపురంలో పురు హెుతుకాశక్తి, విజయవాటికలో కనక దుర్గాంబా సుప్రసిద్దమైనవి. శక్తి పీఠానికి స్థానం గనుక పీఠికాపురమనే పేరు. విజయాంబ అనే నామాంతరం గల దుర్గాదేవి కావాసం గనుక విజయవాటిక అని పేరు ఈ పట్టణాలు వహించాయి.

దుర్గాదేవి బీజశక్తి, కనక బీజవాటిక అనే పేరు ఈ నగరానికి వచ్చింది. బీజవాటి యొక్క వికృ తరూపం బెజవాడ ఈ పేరును గురించి మరొక విధంగా కూడా చెబుతారు. జైన బౌద్ధ బిక్షకులకు ఇదినివాన మై కొందరు చెబుతారు. ఎవరేమి చెప్పినా, పన్నెండువందల ఏళ్ళక్రితం దీనిని బెజవాడ అని పిలిచేవారని విష్ణువర్ధన మహారాజు వ్రాయించిన తామ్రాశాసనం చెబుతుంది. దేశంలో బౌద్ధమతం వెల్లివిరిసిన కాలంలో, అంటే క్రీస్తు మరణానంతరం 639 లో భారత దేశానికి వచ్చిన చైనా యాత్రీకుడు హ్యూన్‌ సాంగ్‌ బెజవాడను కూడా సందర్శించినట్టు రాసుకున్నాడు.

దుర్గామాత రాక్షస సంహారం తరువాత కొన్నాళ్ళు ఇంద్రకీలాద్రిపై విశ్రాంతి తీసుకుంటుంది. విజయం లభించిన ప్రదేశం (వాడ) కావడంవల్ల, ఆ పట్టణానికి విజయవాడ అనే నామం వచ్చిందని స్థల పురాణం. అలాగే, మహాభారతంలో శివునికీ, అర్జునికీ నడుమ ఇంద్రకీలాద్రి కొండపైనే సంగ్రామం జరిగిందని ఐతిహ్యం. అర్జునుడి శక్తికి మెచ్చి శంకరుడు అతడికి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. అర్జునుడి నామాలలో ఒకటయిన విజయుడి పేరు మీద విజయవాడగా ప్రసిద్ధి పొందిందని కొందరి నమ్మకం.

ఇంద్రకీలాద్రి కొండ అప్పట్లో మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకూ విస్తరించి ఉండేదనీ, చుట్టుపక్కల సుమారు పది కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉండేదనీ ఓ కథనం. మధ్యలోకి కృష్ణానది ప్రవాహం రావడంతో...కొండ మధ్యలో బెజ్జం ఏర్పడిందనీ ఆ తర్వాత రూపుదాల్చిన పీఠభూమిలోనే విజయవాడ నగరం వెలసిందనీ చరిత్రకారులు చెబుతారు. అందుకే, బెజవాడను మొదట్లో 'బెజ్జంవాడ' అని పిలిచేవారట.

]]>
amaravati.voice@gmail.com (Amaravati Voice) Telugu Thu, 07 Jul 2016 15:41:15 +0000
ఇంద్రకీలాద్రికి, కనకదుర్గమ్మకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? https://www.amaravativoice.com/Telugu/2016-07-06-16-57-08 https://www.amaravativoice.com/Telugu/2016-07-06-16-57-08 krishna pushkaralu 2 07062016

ఇంద్రకీలాద్రి అని పేరు ఆ కొండకి రావడాన్ని గురించి ఒక కధ చెబుతారు.అతి ప్రాచీనకాలంలో ఇంద్రకీలుడనే పర్వతరాజు వుండేవాడు. ఆయన ఏదో ఘోరమైన పాపం చేశాడు. ఇంద్రుడాగ్రహించి, వజ్రాయి ుధంతో అతని హృదయాన్ని చేధించాడు. ఆ దెబ్బకి రాజు గుండెలో మంటరేగింది. ఆ భాధనలకీలను పశమి ంప జేసుకొవడానికి శతవిధాల ప్రయత్నించాడు. కాని లాభం లేకపోయింది. చివరకు గత్యంతరంలేక జగనా తను పర్వతరాజ పుత్రిని ప్రార్ధించాడు. చల్లనితల్లి కనికరించింది. ఆ కొండ కొమ్మమీదికి వచ్చింది.పర్వత రాజు బాధ శమించింది. నాటి నుంచి దుర్గాదేవికి ఇంద్రకీలాద్రి శిఖరం నివాసమందిరమయ్యింది. నాటినుంచి ఈ కృష్ణాతీరం ఆర్ష ధర్మానికి మళ్ళీ అవాసమయ్యింది.

కనకదుర్గ అని పేరు రావడాన్ని గురించి కొన్ని కధలున్నాయి. నాగారునాచార్యుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి రసయోగాన్ని సాధించాట్ట. అంటే బంగారు చేయడం ఆయనకిక్కడ తెలిసింది గనుక అమ్మవారిని బంగారుతల్లి అని పిలిచి వుండవచ్చు. ఇదొక ఊహ. ఒక గొల్లవాడు గొర్రెల కాచుకుంటూ బ్రతికేవాడు దుర్గాదేవిని నమ్ముకొని కొండకు వచ్చేవాడు. ఒకనాడతనికి కొండమీద పచ్చని రాళ్ళు కనిపించాయి. అమాయకుడైన ఆ యాదవుడారాళ్లను ఊళ్ళోకి తీసుకువెళ్ళి పదిమందికి చూపించాడు. అవి బంగారు కణికలని వారు చెప్పారు. ఆ కొండమీద బంగారు రాళ్ళను పండించిన దుర్గాదేవిని కనకదుర్గ అని వారు చాటి భక్తితో పూజించారు.

మరొక గాధ
పల్లవ వంశీయుడైన మాధవవర్మ అనే రాజు విజయవాటిక రాజధానీ నగరంగా దేశాన్ని పరిపాలించా డు. ఆయన న్యాయంగా ప్రజలనేలాడు. ధర్మరక్షణ కోసం ప్రాణాలనైనా తృజించాలనే న్యాయమూర్తి. ఒక నాడు యునరాజ స్వేతమత్తాశ్వాలు పూన్చిన రధంమీద రాజవీధిలో వాహ్యాళికి బయలుదేరాడు. జనంతో కిక్కిరిసిన రాజవీధిలో రధం అతి వేగంగా నడిచింది.చింతకాయలమ్ముకోనే ఒక పేదరాసి పెద్దమ్మకొడుకు దారినిపోతుండగా అతనిమీదనుంచి రధం సాగి పొయింది. ఆ కుర్రవాడు అక్కడికక్కడే చనిపోయాడు.ఒక్కగా నొక్క కోడుకునూ యువరాజు చంపాడని ఆ ముసలమ్మరాజుగారితో ఫిర్యాదు చేసి, నేరస్తుని శిక్షించమని కోరి పుత్రశోకంతో ప్రాణాలు విడిచింది. ధర్మప్రభువైన మాధవవర్మ న్యాయాధికారుల నాదేశించాడు. "ప్రాణ మ్మ ప్రాణమ్మ బదులు కోరు" అని యువరాజునకు మరణశిక్ష విధించారు.వారి తీర్పును ఎదురించే ఆధికారం తనకున్నా న్యాయాన్ని తప్పని రాజు న్యాయాధికారుల నిర్ణయాన్ని ధ్రువపరిచాడు.ఆ మహారాజు యొక్క ధర్మగుణానికి దుర్గాదేవి సంతోషించి, విజయవాటికలో స్వర్ణవర్షం కురిపించింది. ఆ నాటినుంచి ఈ తల్లికి కనకదుర్గ అని పేరు వచ్చిందని ఒక గాధ ప్రచారంలో వుంది.

]]>
amaravati.voice@gmail.com (Amaravati Voice) Telugu Wed, 06 Jul 2016 16:57:08 +0000
కృష్ణ వేణి నదుల జన్మవృత్తాంతము (కృష్ణా నదికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?) https://www.amaravativoice.com/Telugu/how-the-name-of-krishna-river-emerged https://www.amaravativoice.com/Telugu/how-the-name-of-krishna-river-emerged krishna pushkaralu 1 07052016

పూర్వం బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి భూలోక వాసులను పాపవిముక్తులను జేయుటకు సులభోపాయమును తెలుపమని ప్రార్ధించారు. విష్ణువు బ్రహ్మర్ధులను తోడుకుని పరమేశ్వరుని వద్దకు వెళ్లి విషయము వివరించి సరైన తరుణోపాయమును సూచించమని కోరడం జరిగింది. అంత పరమేశ్వరుడు వారికి తరుణోపాయమును విశిద్ధ్హికపరచి పడమటి కనమలలో గల సహ్యాద్రి పర్వతమందు బ్రహ్మగిరి, వేదగిరి అను రెండు శిఖరములు గలవు. బ్రహ్మగిరి యందు నేవు శ్రీ మహా విష్ణువు ఆశ్వత (రావి) వృక్షము గాను, నేను వేదగిరి యందు పెద్ద ఉసిరిక వృక్షము గాను వెలయదుమని తెలిపారు. మా అంసలో కృష్ణ - వేణి నదులు ఆవిర్భవించి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతములో కలియగలవని ఆ నదీమ తల్లిలో స్నానము ఆచరించిన జనులు సర్వ పాపవిముక్తులు అవుతారని పేర్కున్నారు. అలా బ్రహ్మాది దేవతలకు, ఈశ్వరుడు చెప్పి పంపించెను.

కాలానుగతముగా సహ్య పర్వతమందలి బ్రహ్మగిరి యందు శ్రీ మహా విష్ణువు ఆశ్వత వృక్షముగా ఆవిర్భవించి తన అంశతో "కృష్ణా నది"ని ఆవిర్భింప చేసెను. తదుపరి ఈశ్వరుడు వేదగిరి యందు ఆమలక వృక్షంగా వెలసి తన అంశతో "వేణి నది" గా ఆవిర్భింప చేసెను.

మహారాష్ట్రలోని పూణే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో మహాబలేశ్వరం ప్రాంతంలో జార్ గ్రామంలో కృష్ణా నది పుట్టిన ప్రాంతం. అటు మహాబలేశ్వర ప్రాంతాన ఉద్భవించిన "కృష్ణ - వేణి " నదులతో "ఖిల్లవడి" అనే ప్రదేశానికి పై భాగాన కలిసి కృష్ణవేణి నదులు విడిపోయి పులిగడ్డ నుంచి తూర్పుగా కృష్ణానది ప్రవహించి కృష్ణాజిల్లాలో హంసల దీవి వద్ద బంగాళాఖాతములో కలిసినది. పులిగడ్డ నుండి వేణి నది దక్షిణంగా ప్రవహించి నాచుగుంట ప్రాంతాన మూడు పాయలై "త్రివేణి సాగర సంగమం" ను పేరు ప్రఖ్యాతలు గాంచి సముద్రంలో కలిసినది.

అందువల్ల ఈ రెండు నదుల మధ్య గల ప్రదేశమందు సంకల్పములో "కృష్ణవేణి యోర్యధ్యప్రదేశ్" అని చెప్పుకునే ఆచారము ననుడిలోనికి వచ్చినది.

కృష్ణ నది ఉప నదులు: కోయనా నది, పెన్నా నది, మాలప్రభ నది, భీమా నది, ఎర్ల నది, ఘాట్ ప్రభ నది, దిండి నది, వర్ణ నది, మూసి నది, పాలేరు నది, దూద్గంగ నది.

]]>
amaravati.voice@gmail.com (Amaravati Voice) Telugu Tue, 05 Jul 2016 16:11:03 +0000