శాతవాహన సామ్రాజ్య సింహద్వారం "కోటిలింగాల" సాక్షిగా శతచిత్ర యోధుని "గౌతమిపుత్రశాతకర్ణి" ట్రైలర్ విడుదల. శాతవాహనుల రాజధానిగా వర్థిల్లిన జగిత్యాల జిల్లా కోటిలింగాలలో దర్శకుడు క్రిష్‌తో కలిసి నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగువారికి దేశాన్ని, చరిత్రను అందజేసిన మహానుభావుడు శాతకర్ణి అని పేర్కొన్నారు. తారకరాముని వారసునిగా శాతకర్ణి చరిత్ర ప్రజలకు తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఇదే "గౌతమిపుత్రశాతకర్ణి" ట్రైలర్

Advertisements