బాలయ్య 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి ఘన విజయం సాధించాలని కాంక్షిస్తూ భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్ర యాత్రను ప్రత్యేక వాహనంలో నిర్వహిస్తున్నారు బాలయ్య వీరాభిమాని అనంతపురం జగన్. ఈ నేపధ్యంలో శనివారం భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్ర వాహనం విజయవాడ చేరుకుంది. ఇంద్ర‌కీలాద్రి పై ఉన్న కనకదుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్ర‌కీలాద్రికి, జగన్ రాకతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

వంద పుణ్యక్షేత్రాలకు గౌత‌మీ పుత్ర శాతక‌ర్ణీ డిజైన్ల‌తో, తొమ్మిది వాహనాలను పంపి అక్కడి ఆలయాల నుంచి సేకరించిన కుంకుమతో డిసెంబరు 16న తిరుపతి వెంకన్న సమక్షంలో జరిగే ఆడియో ఫంక్షన్‌లో లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నట్లు అభిమానులు తెలిపారు.

Advertisements