బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌‌‌రెడ్డికి ఫోన్ చేసారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎవరినీ, మీ పార్టీలోకి తీసుకోవద్దు అని చెప్పినట్టు తెలిసిందే. అంతే కాదు, వైసిపీలోకి వెళ్ళాలి అనుకున్న కన్నా లక్ష్మీ నారాయణకు కూడా అమిత్ షా ఫోన్ చేసి, వైసీపీ లోకి వెళ్ళద్దు అని, త్వరలో మీ రాష్ట్రంలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయిని, చెప్పినట్టు సమాచారం... అమిత్ షా ఫోన్ చేసిన తరువాత, మనసు మార్చుకున్న కన్నా ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. అస్వస్థత అనే వంకతో, కన్నా హాస్పిటల్ లో చేరి, వైసిపీ తో చేరే అంశం వాయిదా వేసారు. ఢిల్లీ నుంచి అమిత్ షా.. ఒక్క ఫోన్ కాల్‌తో అంతా మారిపోయింది అని సమాచారం.

kanna 25042018

అటు జగన్ కు కూడా ఫోన్ చేసి, మా పార్టీలో నుంచి ఎవర్నీ, చేర్చుకోవద్దు.. త్వరలోనే దీనికి సంబంధించి మీకు స్పష్టత ఇస్తాము. మీ రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి, ఈ తరుణంలో, ఈ చేరికలు కరెక్ట్ కాదు అని అమిత్ షా, జగన్ తో చెప్పారని తెలిసింది.. జగన్ కూడా , దీనికి అంగీకారం తెలుపుతూ, మీరు ఎలా చెప్తే అల అని చెప్పారు... కన్నా లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మా పార్టీలోకి వస్తాను అన్నారని, మీ సూచన మేరకు వారిని పార్టీలోకి ఇప్పుడే తీసుకోము అని, మీ ఆదేశాల కోసం ఎదురు చూస్తామని, జగన్, అమిత్ షా తో చెప్పారు..

kanna 25042018

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దెబ్బకు బిజెపి విలవిలలాడుతోంది. ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని ఎంత దెబ్బ తీయాలో అంతా దెబ్బతీసింది. ఇలాంటి స్థితిలో నాయకుల్లో కూడా గందరగోళం నెలకొంది. తమ రాజకీయ భవిష్యత్తును చూసుకొని నాయకులు వైసీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇది జరిగితే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిస్థాయిలో నిర్జీవంగా తయారవుతుంది అమిత్ షా గ్రహించారు. ఇందుకు ఎక్కడో ఒకచోట చెక్ పెట్టాలనే ఆలోచనతోనే ఆయన నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఒకవైపు పార్టీ మారాలనుకునే నాయకులను బుజ్జగిస్తూనే మరోవైపు వైసీపీ అధినేత అధినేత జగన్ కు అమిత్ షా ఫోన్ చేసి మరీ చెప్పటంతో, జగన ఆయన మాటలు వినాల్సిన పరిస్థితి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read