ఏపీలో సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వచ్చయి. ఇక దీన్ని పట్టుకుని బీజేపీ నేతలు హడావిడి చేస్తున్నారు.. చూసారా, మీ చంద్రబాబు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా, మేము మీకు ఎంత చేస్తున్నామో, మా మోడీకి మీరు అంటే అంత ఇష్టం అంటూ ఊదరగొడుతున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, అనంతపురం జిల్లా జంతలూరులో యూనివర్శిటీని నెలకొల్పేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. రూ.902 కోట్ల వ్యయంతో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించనుందని, ఈ నిర్మాణానికి సంబంధించి బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు..

bjp 16052018 2

యూనివర్శిటీకి సంబంధించి పూర్తి స్థాయి భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో యూనివర్శిటీని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. నిధులు విడుదల చేసే ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. అయితే, ఈ వార్తా పట్టుకుని, బీజేపీ చేసే హడావిడి అంతా ఇంతా కాదు... అయితే, దీని వెనుక ఉన్న వాస్తవం చూద్దాం.. ఇదేదో, బీజేపీ, మోడీ మన మీద ప్రేమతో ఇచ్చేది కాదు. ఇది రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలో పలు కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయం ఉంది. ఇందులో భాగంగానే సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కూడా ఉంది.

bjp 16052018 3

దీని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా జంతలూరులో, 2015లోనే భూమి కేటాయించింది. దీని కోసం 1100 కోట్లు విలువ చేసే, 491.23 ఎకరాలు భూమి అప్పట్లోనే ఇచ్చింది. అంతే కాదు, ఈ యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా, రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు కేటాయించింది.. కేంద్రం ముందుగా చెయ్యల్సింది, సెంట్రల్ యూనివర్సిటీ చట్టానికి సవరణలు. అప్పుడు కాని, యూనివర్సిటీ పెట్టటం కుదరదు. ఈ చిన్న పని, 4 ఏళ్ళు అయినా చెయ్యలేదు.. ఇప్పుడు సుప్రీమ్ కోర్ట్ లో కేసు, ప్రజల ఆందోళన చూసి, కనీసం ఆ బిల్ అయినా పెట్టి, పనులు మొదలు పెట్టాలని చూస్తుంది. దీని కోసం, ఎదో చేసేసినట్టు, మనకి ఎదో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు హడావిడి చేస్తున్నారు. వీళ్ళు ఆ చట్టంలో సవరణ తెచ్చి, ఇప్పుడు కేంద్ర విద్యా సంస్థలకు ఇస్తున్నట్టు డబ్బులి ఇస్తూ పొతే, ఇది కూడా మరో 50ఏళ్ళు పడుతుంది... దీనికి ఎదో చేసేసినట్టు బిల్డ్ అప్ ఇస్తారేంటి ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read