తీవ్ర ఆర్ధిక లోటు ఒక పక్క.... అయినా సరే, ఎలక్షన్ హామీలు ఎలా అయినా తీర్చాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు... రైతు రుణమాఫీ లాంటి అతి పెద్ద కార్యక్రమం చేస్తూ, 1000 రూపాయలు పెన్షన్ లు ఇస్తూ, ఎలక్షన్ హామీలలోని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ముందుకు సాగుతున్న చంద్రబాబు, ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, నిరుద్యోగ బృతి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రెండు, మూడు మోడల్స్ కూడా వర్క్ అవుట్ చేసారు... ఎలాగైనా ఇది, మార్చ్ 13న ప్రవేశపెట్టే బడ్జెట్ లో చేర్చాలి అని చంద్రబాబు అధికారులని ఆదేశించారు.

రుణ మాఫీ, పెన్షన్ లు లాగానే, నిరుద్యోగ బృతి కుడా చాలా పకడ్బందిగా ఇవ్వనున్నారు. ఇందుకోసం, అన్ని రకాలుగా అవసరమైన టెక్నాలజీ, డేటా, ఉపయోగించుకోనున్నారు. ఎవరికీ పడితే వారికి కాకుండా, నిజమైన లబ్దిదారులకు ఇది ఉపయోగపడే విధంగా, నిరుద్యోగ బృతి ఇవ్వనున్నారు.

చంద్రబాబు సూచించిన దాని ప్రకారం:
ఎంప్లొయ్మెంట్ ఎక్స్చేంజి ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
అలాగే, రిజిస్టర్ చేసుకుని, కనీసం 5 సంవత్సరాలు అయ్యి ఉద్యోగం రాకుండా ఉన్న వాళ్ళు అర్హులు.
ఈ నిరుద్యోగ బృతి, నెలకు రెండు వేలు చొప్పున, కొత్త ఉద్యోగం వచ్చే వరకు, లేఅకపోతే, 2 కాని 3 సంవత్సరాల వరకు మాత్రమే ఇస్తారు.
దీని కోసం, సంవత్సరానికి, 1000 కోట్లు కేటాయించనున్నారు.

విధివిదానాలు ఇంకా ఖరారు కానప్పటికే, అధికారాలతో ముఖ్యమంత్రి జరిపిన చర్చల్లో, ఇవి ప్రతిపాదించారు... మరో రెండు, మూడు మోడల్స్ వర్క్ అవుట్ చేసి, ఫైనల్ చేద్దాం అని, అధికారాలను ముఖ్యమంత్రి ఆదేశించారు.

అధికారిక రికార్డు ల ప్రకారం, దాదాపుగా 10 లక్షల నుంచి, 20 లక్షల మంది దాకా, ఎంప్లొయ్మెంట్ ఎక్స్చేంజి ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకుని ఉంటారు అని ఒక అంచనా.

ఇదే జరిగితే దేశంలోనే ఇది సంచలన నిర్ణయంగా మారనుంది. వాస్తవానికి నిరుద్యోగ భృతి 2014 ఎలక్షన్ హామీగా ఇచ్చారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కారణంగా ఇప్పటి వరకు, అది సాధ్య పడలేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్ కు, ఇప్పుడు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది. చంద్రబాబు నిరుద్యోగ బృతి ఇవ్వలేడు అని, యువతని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలి అనుకున్న జగన్ ఆశల మీద, చంద్రబాబు నీళ్ళు చల్లారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read