వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇజ్రాయల్ దేశ రాయబారి డానియల్ కార్మన్ గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వివిధ అంశాలపై వారు చర్చించారు.
అంతర్గత భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వ్యవసాయం, విద్య, నీరు, ఆరోగ్య రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధమని సిఎంకు డానియల్ తెలిపారు. సముద్రం నీటి నుంచి మంచినీరు తయారీ గురించి వివరించారు. కుప్పంలో ఏర్పాటు చేస్తున్న వ్యవసాయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు త్వరలోనే పూర్తి అవుతుందని వివరించారు.
అలాగే, చంద్రబాబుతో కలిసిన విషయాన్ని డానియల్ కార్మన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, చంద్రబాబును కలవటం ఎంతో ఇన్స్పిరింగ్ గా ఉంటుంది అని, ఆయనతో కలిసి పని చెయ్యటం సంతోషం అని అన్నారు. ఆ ట్వీట్ కింద ఫోటోలో చూడవచ్చు.
Advertisements