మంత్రి పరిటాల సునీత తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఆక్సిడెంట్ లో గాయాలుపాలైన 25 మందిని, దగ్గర ఉంది హాస్పిటల్ కు తరలించి సమయానికి వైద్యం అందించారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలం అంబాపురం గుండా వెళుతున్న ఓ పెళ్లి బస్సు ఈ రోజు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో ఆ బస్సులోని 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అయితే అటుగా వెళ్తున్న మంత్రి పరిటాల సునీత బస్సు ఆక్సిడెంట్ అయ్యి, గాయాలతో ప్రజలు కనిపించారు.. క్షణం ఆలస్యం చేయకుండా తన వాహనాలను అక్కడే నిలిపి.. అంబులెన్స్ కు ఫోన్ చేసి, దగ్గరుండి హాస్పిటల్ కు తరలించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఆ సమయంలో, మంత్రి తనయుడు పరిటాల శ్రీరాం కూడా, పక్కన ఉన్నారు... దగ్గర ఉండి క్షతగాత్రులును అంబులెన్స్ లో ఎక్కించారు.
ఆపద సమయంలో ఆదుకున్న మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు.