నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఫిన్ టెక్నాలజీ (ఫిన్టెక్ ) టవర్ నిర్మించేందుకు యస్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ బ్యాంక్ చైర్మన్ రాణా కపూర్ ముంబైలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను తెచ్చారు.
ఇప్పటికే యస్ బ్యాంక్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాల్లో మొలిక సదుపాయాలు, ఐటి రంగాలను విస్తరించింది. భారత్ లో ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్లలో కూడా పలు సంస్థలు నిర్వహిస్తోంది.
దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన అమరావతిలో తమ వ్యాపార సామ్రాజ్యా న్నివిస్తరించుకోవాలన్న ఆసక్తితో ఉంది. దీని పై ముఖ్యమంత్రితో చర్చించిన బ్యాంక్ చైర్మన్ రాణాకపూర్ ఫిన్టెక్ పార్క్ ఏర్పాటుకు ముందుకొచ్చారు.
<div style="text-align: center;">
ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో పరిశ్రమలకిస్తున్న ప్రోత్సాహకాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు వివరించారు. నేరుగా అమరావతి చ్చి స్థానిక పరిస్థితుల్ని బేరీజు వేసుకోవాలని సూచించారు.
పర్యాటక రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్ బ్యాంక్ ఆసక్తి కనబరిచింది.