టీమిండియా రెండోసారి అంధుల టి20 క్రికెట్ ప్రపంచ చాంపియన్గా నిలిచింది. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది.
అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, భారత జట్టుకు సారధ్యం వచించింది, ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి. భారత జట్టు రెండోసారి టి20 ప్రపంచకప్ సాధించడంలో ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్లు ఆడిన అజయ్ మొత్తం 296 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో అజయ్ 9 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
గుంటూరు జిల్లా గురజాలకు చెందిన 26 ఏళ్ల అజయ్ కుమార్ రెడ్డి జట్టుకు భారత జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన అజయ్, భారత జట్టు తరఫున క్రికెట్ ఆడటం వెనుక తల్లిదండ్రుల త్యాగం, భార్య ఇచ్చిన స్ఫూర్తి, పనిచేసే సంస్థ అందించిన సహకారం ఎంతగానో ఉన్నాయి అంటారు, అజయ్.
కళ్ళు ఎలా పోయాయి అంటే...
నాలుగేళ్ల వయసులో తెల్లారుజామున నిద్రలేచి వేగంగా బయటికి పరిగెడుతుంటే తలుపు గడియ మొన ఎడమ కంటికి గుచ్చుకుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ కన్ను కోడిగుడ్డంత వాచింది. చివరికి కన్ను పోయింది. ఒకటో తరగతిలో చివరి బెంచ నుంచీ బోర్డుపైన అక్షరాలు కుడికన్నుతో చూస్తే స్పష్టంగా కనిపించేవి. ఆరో తరగతికి వచ్చేసరికి మొదటి బెంచ్కు వచ్చినా బోర్డుపై ఉన్న అక్షరాలు పోల్చుకోలేనతంగా దృష్టి తగ్గిపోయింది. అదే సమయంలో అజయ్ అమ్మానాన్నలు నర్సరావుపేటకు మకాం మార్చారు. అక్కడే ఉన్న బ్లైండ్ స్కూల్లో ఏడో తరగతిలో అజయ్ ను చేర్పించారు. రెండేళ్ల తర్వాత స్కూల్లోని క్రికెట్ జట్టులో చేరాడు అజయ్. అప్పటి నుంచి, వెనక్కు తిరిగి చూడలేదు.
2006లో ఆంధ్రప్రదేశ్ టీంకు, 2010లో ఇండియన్ క్రికెట్ టీమ్కు సెలెక్ట్ కావడం, 2012లో వైస్ కెప్టెన్, 2014లో టీం ఇండియా కెప్టెన్ అయ్యాడు అజయ్.
టి20 క్రికెట్ టోర్నమెంట్ లో, అజయ్తో పాటు, ఆంధ్రప్రదేశ్కే చెందిన దున్నా వెంకటేశ్వర రావు, టి. దుర్గా రావు (శ్రీకాకుళం), జి. ప్రేమ్ కుమార్ (కర్నూలు) కూడా ఈ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహించారు.
మీ ప్రతిభ అమోఘం.. ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు.. దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నారు... హాట్స్ అఫ్ అజయ్ & టీం...