అరకు అంటే ప్రకృతి అందాలు, అమాయక గిరిజనం, మనల్ని మనం మరిచిపోయే కొండకోనలు దృశ్యాలు గుర్తొస్తాయి. అంతేనా..? ప్రపంచాన్నే కట్టిపడేసే అర్గానిక్ కాఫీ రుచికి కూడా కేరాఫ్ అడ్రస్ అరకే. ఏజెన్సీ ఏరియను దాటి ప్రస్తుతం సప్తసముద్రాల అవతల ఉన్న కాఫీ ప్రియులను సైతం మైమరింపచేస్తోంది అరకు కాఫీ.

ఇప్పటివరకు అరుదైన నాణ్యత గల ఉత్పత్తులు పారిస్ వంటి నగరాల నుంచి భారతదేశానికి వస్తుంటాయి. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా మన తెలుగింట పండిన అరకు కాఫీ విదేశంలో గుభాళిస్తోంది. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు మెరుగైన జీవనోపాధి కల్పించే లక్ష్యంతో, అరకు ప్రాంతంలో భారీ ఎత్తున కాఫీ సాగును ప్రోత్సహించడమే కాకుండా, అరకు కాఫీని ఒక అంతర్జాతీయ బ్రాండ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అమోఘం. చంద్రబాబు దార్శనికత ఫలితంగా ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత పారిస్ మార్కెట్ లోకి అరకు కాఫీ అడుగు పెడుతోంది. ప్రపంచంలో టాప్ కాఫీ బ్రాండ్ లకి, పోటీ ఇవ్వనుంది, మన అరకు కాఫీ..

చంద్రబాబుతో పాటు నాలుగు వ్యాపార దిగ్గజ సంస్థల అధిపతులు కూడా ఈ కృషిలో భాగస్వాములయ్యారు. మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సోమా నిర్మాణ సంస్థ చైర్మన్ మాగంటి రాజేంద్రప్రసాద్ లు పారిస్ లో అరకు కాఫీ మొదటి స్టోర్ ప్రారంభం అయ్యేందుకు కారణమయ్యారు. ఈ సంస్థల ఆధ్వర్యంలో 20,000 ఎకరాలలో కాఫీ పంట సాగవుతోంది. ఈ సంస్థలే అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్ ను తెచ్చి పెట్టారు. ఇప్పుడు అరకు కాఫీ పారిస్ లో అడుగుపెట్టడం అన్నది 150 గిరిజన తెగల విజయం. ఐదు వేరియెంట్లలో అమ్ముడు కానున్న అరకు కాఫీ ధర కిలో రూ.7,000లుగా ఉండనుంది.

విశాఖ మ‌న్యంలో గిరిజ‌నులు పండిస్తున్న కాఫీకి చంద్ర‌బాబు త‌న వంతు ప్ర‌మోట్ చేస్తున్నారు. చంద్ర‌బాబు దేన్నైనా ప్ర‌మోట్ చేయాల‌నుకుంటే దాన్ని ఓ రేంజ్‌కు తీసుకెళ్లే వ‌ర‌కు వ‌ద‌ల‌రు. తాజాగా ఆయన విశాఖ మన్యం అరకులో పండిస్తున్న అరకు కాఫీని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. రాష్ట్రానికి వచ్చే ప్రముఖులు ఎవరైనా సరే.. వారికి అరకు కాఫీని రుచి చూపించి.. దాని గొప్పతనం వివరించి చెప్పటమే కాదు.. అరకు కాఫీ మీద సర్వత్రా ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఈ కాఫీని గిఫ్ట్‌గానూ ఇస్తున్నారు.

ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన ‘అరకు కాఫీ’, ‘అరకు వ్యాలీ కాఫీ’ పేరుతో ఆర్గానిక్ కాఫీ మార్కెట్లోకి వస్తోంది. ఈ కాఫీ తయారీకి గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటలకు అనువైన వాతావరణం ఉంది. ప్రస్తుతం అక్కడ 96,337 ఎకరాల్లో కాఫీ పంట సాగవుతోంది. ఇందులో అరబికా రకాన్నే గిరిజన రైతులు అత్యధికంగా పండిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ అరకులో పండించే అరబికా రకం కాఫీకి మంచి డిమాండ్ ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read