ఆంధ్రప్రదేశ్ తొలి పరిపాలనా రాజధాని విజయవాడను సరికొత్త ఐటి కంపెనీలు పలకరిస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత, రాజధాని అమరావతి ప్రాంతానికి ఏ కంపెనీలు రావట్లేదు అనుకునేవారికి ఎట్టకేలకు కొంత ఉపసమనం.

మొదట విడతగా, విజయవాడలో ఫిబ్రవరి 16న ఎనిమిది ఐటి కంపెనీలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో 500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
విజయవాడ, ఆటోనగర్ ప్రాంతంలో, ఈ ఎనిమిది ఐటి కంపెనీలు ఫిబ్రవరి 16న ప్రారంభం అవుతాయి.

Accel IT, Horizon IT, AdvanSoft (Chicago), MSR Cosmos, Adept Solutions, Intellisoft and TimesquareIT

అలాగే హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన,15 ఐటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా విజయవాడలో ప్రారంభం కాబోతున్నాయి. వీటి ద్వారా, సుమారుగా 3000 మందికి, ఐటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణ ఇస్తారు.

ఎంతో కాలంగా, నిరుపయోగంగా ఉన్న గాన్నవరంలోని మేధా టవర్స్ కూడా త్వరలో జీవం పోసుకోనుంది. స్పెయిన్ కు చెందిన Grupo Antolin త్వరలోనే ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అలాగే HCL, Neslova Systems కూడా త్వరలో మేధా టవర్స్ నంచి పని చేయ్యనున్నాయి.

ఈ పరిశ్రమల రాకతో, రాజధాని ప్రాంతంలో ఐటి పరిశ్రమలకు పెద్ద ఊతమిచ్చినట్లు అవుతుంది. HCL లాంటి పెద్ద కంపెనీ రాజధానిలో కాలు మోపితే, దాని బాటలో మరి కొన్ని పెద్ద కంపెనీలు వచ్చే అవకాసం ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఐటి రంగంలో ప్రపంచ దేశాలతోనే కాకుండా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పడేది. రాష్ట్ర విభజన తర్వాత ఐటిలో కాస్త వెనుకబడినట్టే కనిపించింది. 2016 జనవరిలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి రంగం అంతగా ఉనికి చాటుకోలేదు. కానీ ఈ ఏడాది పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థల ముందుకువచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఐటి రంగం విస్తరించి ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read