గన్నవరం విమానాశ్రయానికి సేవలందించేందుకు నూతన ఎయిర్ బస్ నియో-320 బుధవారం సాయంత్రం 4.45 నిమిషాలకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఎయిర్ ఇండియా లీజుకు తీసుకున్న 13 విమానాల్లో ఒకదాన్ని విజయవాడకు కేటాయించింది. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ విజయవాడ-హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో నడుపుతోంది.

భారీ ఎయిర్ బస్ ల్యాండ్ కాగానే ఆనవాయితీ ప్రకారం వాటర్ కేనల్ సెల్యూట్తో స్వాగతించారు. ప్రపంచ వ్యాప్తంగా "ఎయిర్ బస్ నియో- 320 ఎయిర్ క్రాఫ్ట్ కు మంచి డిమాండ్ ఉంది. కువైట్ దేశం నుంచి వీటిని ఎయిర్ ఇండియా అద్దెకు తీసుకుంది. ఈ విమానంలో మొత్తం 162 సీటు ఉంటాయి. 12 బిజినెస్ కాస్ సీటు ఉంటాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read