2016 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని దక్కించుకున్న కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. కె. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే వరించడంతో తెలుగువారి కీర్తి మరోసారి జాతీయస్థాయిలో మార్మోగిందని సంతోషం వ్యక్తం చేసారు ముఖ్యమంత్రి.

శంకరాభరణం, శృతిలయలు, సిరివెన్నెల, సాగరసంగమం, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వాతిముత్యం వంటి మనసుకు హత్తుకునే అపురూప, చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు ఎన్నో తెలుగువారికి అందించారు అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ రోజుల్లోనే ఒక తెలుగు సినిమాను ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యేలా రూపొందించిన ఘనత కె. విశ్వనాథ్‌దే అని అన్నారు.

1957లో సినిమారంగంలో ప్రవేశించి నేటికి కూడా వెండితెరతో అనుబంధాన్ని కొనసాగిస్తూ కె. విశ్వనాథ్ భారతీయ చలన చిత్ర రంగానికి ఎంతో సేవ చేస్తున్నారు అన్నారు. సినీ ప్రపంచంలో అడుగుపెట్టే భావితరాలకు కె. విశ్వనాథ్ స్ఫూర్తిగా, మార్గదర్శిగా నిలుస్తారు అని ముఖ్యమంత్రి అన్నారు.

Advertisements