ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు సంబంధించిన మరిన్ని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా, భాజపా, తెరాస సంబంధం ఆధారాలతో సహా బయటపడిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు టెలీకాన్ఫరెన్స్‌లో గురువారం ఆయన పార్టీ నేతలతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ 26 రోజులూ రేయింబవళ్లు కష్టపడి పార్టీ అఖండ విజయానికి కృషి చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ‘టైమ్స్‌ నౌ’ జరిపిన స్టింగ్‌ ఆపరేషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ- భారతీయ జనతా పార్టీ మధ్య బంధం బయటపడిపోయిన నేపథ్యంలో దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం పలువురు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

thota 29102018 1

బీజేపీ, వైసీపీ లాలూచీని ‘టైమ్స్‌ నౌ’ స్టింగ్‌ ఆపరేషన్‌ బయటపెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థులపై వైసీపీ బలహీన అభ్యర్థులను దించుతారని ఆ పార్టీ నేతే చెప్పారు. పలు కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న జగన్‌ను బీజేపీ వాళ్లు దాసోహం చేసుకున్నారు. అక్కడేమో మోదీకి దాసోహైన ఆయన.. ఇక్కడ మాత్రం కేసీఆర్‌కు అయ్యారు. ఇలాంటి వైసీపీ రాష్ట్రానికి అవసరమా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఆంగ్ల వార్తా చానల్‌ ‘టైమ్స్‌ నౌ’ జరిపిన స్టింగ్‌ ఆపరేషన్‌లో విజయవాడ నగర వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారీ వైసీపీ, బీజేపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని ఒప్పుకున్న విషయం తెలిసిందే. బుధవారం దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. ఇరు పార్టీల మధ్య అధికారిక పొత్తు లేనప్పటికీ... పోటీ విషయంలో రహస్య అవగాహన ఉందని ఆ వీడియోలో మనోజ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలాంటి వారు పోటీచేసే చోట సాదాసీదా, బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలపాలన్నది తమ పార్టీ విధానమని మనోజ్‌ వెల్లడించారు. వీటితో పాటు ఆయన మరెన్నో విషయాలు బయటపెట్టారు.

 

thota 29102018 1

‘వైసీపీ, బీజేపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోంది’... ఇది తెలుగుదేశం పార్టీ తరచూ చేసే ఆరోపణ! ‘ఇది నిజమే’ అని విజయవాడ నగర వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారీ అంగీకరించారు. వైసీపీ, బీజేపీ మధ్య బంధం ఉందని స్పష్టంగా చెప్పారు. ఆంగ్ల వార్తా చానల్‌ ‘టైమ్స్‌ నౌ’ జరిపిన స్టింగ్‌ ఆపరేషన్‌లో మనోజ్‌ కొఠారీ మరెన్నో విషయాలు బయటపెట్టారు. ఇరు పార్టీల మధ్య అధికారిక పొత్తు లేనప్పటికీ... పోటీ విషయంలో రహస్య అవగాహన ఉందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలాంటి వారు పోటీచేసే చోట సాదాసీదా, బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలపాలన్నది తమ పార్టీ విధానమని మనోజ్‌ వెల్లడించారు. స్టింగ్‌ ఆపరేషన్‌లో ‘టైమ్స్‌ నౌ’ ప్రతినిధితో మనోజ్‌ కొఠారీ జరిపిన సంభాషణ ఇది....

Advertisements