విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటన పై పూర్తి వివరాలు తెలుసుకోవటానికి, కేంద్రప్రభుత్వం సొంతగా ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. కేంద్ర మంత్రిత్వహోంశాఖ, రసాయన మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఈ కమిటీని నియమించింది. గురువారం విశాఖ దురటనపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, కిషన్ రెడ్డి, కేబినెట్, హోం, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల తో గురువారం సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో గ్యాస్ లీకేజీ మటనకు దారి తీసిన అంశాలపై సుదీర్ఘంగా చరించారు. అనంతరం ఘటనపై ప్రత్యేక కమిటీని నియమించారు. అయితే, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ మంత్రులతో కమిటీ వేసింది. అయితే, ఇది పరిగణలోకి తీసుకోకుండా, కేంద్రమే ఒక కమిటీ వెయ్యటం, తామే పూర్తీ వివరాలు తెలుసుకుంటాం అని, కేంద్రం చెప్పటంతో, కేంద్రం ఈ విషయంలో, ఎంతో సీరియస్ గా ఉందని అర్ధం అవుతుంది.

ఇక మరో పక్క, మోడీ గురువారం ఉదయమే జగన్ కు ఫోన్ చేశారు. ఆయన గ్యాస్ లీకేజీ కారణాలను, విశాఖలో పరిస్థితుల పై జగన్ ను ఆరా తీసారు. గ్యాస్ లీకేజీ బాధితులను ఆదుకునే విషయంలోను, సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందని, ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ రంగలోకి దిగిన విషయాన్నీ చెప్పారు. ఘటనపట్ల ప్రధాని తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసారు.ఎల్జీ పాలిమర్స్ రసాయన ఎరువుల కంపెనీలో ప్రమాదంపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలను ముఖ్యమంత్రి జగనకు ప్రధాని నరేంద్రమోడీకి వివరించారు. గ్యాస్ లీకేజీ ప్రభావం అయిదు గ్రామాల పైన, 15 వేలమందికి పైగా ప్రజలపైన ఉందని తెలిపారు. ఘటన ప్రాంతం లోను, ప్రభావిత గ్రామాల్లోను రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయక చర్యలను చేపట్టినట్లు వివరించారు.

ప్రస్తు తానికి పరిస్థితి అదువులో ఉందని తెలిపారు. బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. దీనికి స్పందించిన ప్రధాని మోడీ ఈ విషయంలో కేంద్రం సహాయకారిగా ఉంటుందని, అవసరమయైన వైద్య,సహాయక బృందాలను పంపిస్తుందని తెలియచేసారు. ప్రధాని నరేంద్రమోడీ జరిగిన మటనపై ట్వీటరు వేదికగాను ప్రధాని మోడీ విచారాన్ని వ్యక్తం చేసారు. ప్రమాదంపై కేంద్ర మంత్రిత్వ శాఖ. జాతీయ విపత్తుల నివారణశాఖ అధికారులతో మాట్లాడానని ప్రధాని ట్వీటరులో వివరించారు. బాధితులను ఆదుకునే విధంగా తక్షణ సహాయచర్యలకు ఆదేశించినట్లు వివరించారు. ఘటనపై వరిస్థితులను ఎప్పటికప్పుడు విచారిస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేసారు. విశాఖ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్ర్భాంతిని వ్యక్తం చేసారు.

Advertisements