నిన్న విశాఖలో, వైసీపీ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏకంగా అంతర్జాతీయ విమానశ్రయంలోకి, రాళ్ళు, గుడ్లు తీసుకు వెళ్లి, వీరంగం సృష్టించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ క్యాటగరీ భద్రత ఉన్న వ్యక్తి వస్తుంటే, అంత మంది, వేరే పార్టీ వాళ్ళని, అక్కడకు పోలీసులు రాణించిన తీరు పై విమర్శలు వచ్చాయి. అదీ కాక, నాలుగు అయుదు గంటలు, చంద్రబాబుని కదలనివ్వకుండా ఉంటే, వారిని ఎందుకు చెదరగొట్ట లేదు అనే ప్రశ్నకు కూడా వచ్చాయి. సాక్షాత్తు హైకోర్ట్ కూడా ఇదే ప్రశ్న పోలీసులను అడిగింది. ఒకానొక సందర్బంలో, పరిస్థతి చేయి దాటే పరిస్థతి వచ్చినా, పోలీసులు మాత్రం వైసీపీ మూకలను అక్కడ నుంచి తరమకుండా ఉంచటం పై, విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు, ఇందులో ఏమైనా కుట్ర ఉందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే, ఇదే సందర్భంలో, నిన్న చంద్రబాబు భద్రత విషయంలో కేంద్రం వెంటనే స్పందించినట్టు, వార్తలు వస్తున్నాయి. నిన్న జరిగిన పరిణామాల పై, కేంద్ర హోం శాఖ స్పందించినట్టు తెలుస్తుంది.

home 28022020 2

నిన్న చంద్రబాబు గారిని నిలువరించే సందర్భం, అరెస్ట్ చేసే సందర్భంలో, పోలీసుల తీరు పై ఆయన కేంద్ర భద్రతా అధికారులు అయిన ఎన్ఎస్‌జీ (NSG) సెక్యూరిటీ, మొత్తం కేంద్ర హోం శాఖకు నివేదించింది. ఇంత జరుగుతున్నా ఆందోళనకారులను క్లియర్ చెయ్యక పోవటం పై వారు ఆందోళన చెందారు. అదే సందర్భంలో, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటనికి వీలు లేదని, పోలీసులు తెగేసి చెప్పారు. మొత్తం విషయాన్ని ఎప్పటికప్పు కేంద్ర హోంశాఖకు నివేదించారు. పరిస్థితి చేయి దాటితే, ఫైర్ ఓపెన్ చేసే అవకాసం ఇవ్వాలి అంటూ, వారు పై నుంచి ఆదేశాల కోసం అడిగినట్టు, అదుపు తప్పితే కనుక, అలాగే చెయ్యండి, అంటూ కేంద్ర హోం శాఖ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.

home 28022020 3

అయితే ఈ మొత్తం వ్యవహారం పై కేంద్రం కూడా సీరియస్ అయ్యిందని, డీజీపీకి కేంద్ర హోం శాఖ నుంచి ఫోన్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. చంద్రబాబుని అడ్డుకుంటాం అని మంత్రులు చెప్పినా, రాజు అనే ఒక వ్యక్తి ఆర్గనైజ్డ్‌గా మొత్తం చేస్తున్నట్టు ముందే తెలిసినా, ఎందుకు నిలువరించ లేదు అని వివరణ అడిగినట్టు వార్తలు వచ్చాయి. ఫైర్ ఓపెన్ చేసే పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది అంటూ వివరణ కోరినట్టు తెలుస్తుంది. ముందుగా ఆయన రావటానికి పర్మిషన్ ఇచ్చి, తరువాత అల్లరి చెయ్యటానికి వచ్చిన వారిని అరెస్ట్ చెయ్యకుండా, చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చెయ్యాల్సి వచ్చిందో వివరణ కోరినట్టు తెలుస్తుంది. అయితే, ఈ విషయం పై, అధికారికంగా సమాచారం లేదు, కొన్ని వార్తా చానల్స్ ఈ విషయం పై, వార్తలు ప్రసారం చేసాయి.

Advertisements