వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను సింగిల్ సింహాన్ని అంటూ మేక‌పోతు గాంబీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారే కానీ..చంద్ర‌బాబు ప‌న్నిన త్రిశూల వ్యూహంలో చిక్కుకుని విల‌విల్లాడుతున్నాను. ఆఫ్రికా మోడ‌ల్ మూడు రాజ‌ధానుల‌కి ఆద్యుడు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై మూడు ప్రాంతాల నుంచి ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్ అమ‌లు చేసి చంద్ర‌బాబు త‌న మాస్ట‌ర్ మైండ్ మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. రాయ‌ల‌సీమలో పాద‌యాత్ర ముగించుకుని కోస్తాలో అడుగుపెట్టారు నారా లోకేష్‌. సీమ‌లో అడుగు పెట్టారు చంద్ర‌బాబు. మ‌రోవైపు గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ఊపు తెచ్చేలా కార్య‌క్ర‌మాలు రూపొందించారు. వీటిని నిర్వ‌హించే బాధ్య‌త టిడిపి ఏపీ అద్య‌క్షుడు అచ్చెన్నాయుడుకి అప్ప‌గించారు. ఎక్క‌డ ఎవ‌రిని ఎలా ఎదుర్కోవాలో జ‌గ‌న్ ఆలోచించే లోపే టార్గెట్ పూర్తి చేసి వ‌చ్చేలా మెరుపు ప‌ర్య‌ట‌న‌లు ప్లాన్ చేశారు బాబు. ఎటాకింగ్ మోడ్ కూడా డిఫ‌రెంట్ గా ప్లాన్ చేశారు. ఓ వైపు జ‌గ‌న్ రెడ్డి అవినీతిని, అస్త‌వ్య‌స్థ పాల‌న‌ని ఎండ‌గడుతూనే...మ‌ళ్లీ వైసీపీకి అవ‌కాశం ఇస్తే జ‌నానికి బ‌తికే చాన్స్ లేద‌ని చైత‌న్యం చేస్తూనే...టిడిపి అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కి చేసే మేలు-రాష్ట్రాభివృద్ధి ప్ర‌ణాళిక‌లు వివ‌రిస్తున్నారు.

Advertisements