ఆయన ఒక కూలి... అలాంటి పెద్దయిన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా ? నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తానూ కష్టపడి దాచుకున్న సొమ్మును విరాళంగా అందించటానికి వచ్చారు.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు... చంద్రబాబు పిలుపు మేరకు, ప్రజా రాజధాని నిర్మాణానికి సమాజంలోని అన్ని వర్గాల నుండి విరాళాలు అందుతున్నాయి... కూలీపని చేసుకునేవారు సైతం ప్రజా రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఓ సంఘటన బుధవారం ముఖ్యమంత్రి నివాసం వద్ద గల గ్రీవెన్సు హాలులో జరిగింది.

కృష్ణా జిల్లా పెనుకంచిప్రోలు మండలం కుల్లికోళ్ల గ్రామానికి చెందిన నారిశెట్టి పుల్లయ్య(68) s/o ఆంజనేయులు రాజధాని నిర్మాణానికి రూ.22,210లు చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందజేశారు. కూలీపని చేసుకునే నారిశెట్టి పుల్లయ్య రాజధాని నిర్మాణానికి విరాళం ఇచ్చిన స్ఫూర్తిని ముఖ్యమంత్రి అభినందించారు. తనకున్నంతలో ఎదుటివారికి సహాయపడాలి అనే తెలుగువారి సేవా గుణానికి ఇదొక నిదర్శనమని ముఖ్యమంత్రి శ్రీ నారి శెట్టి పుల్లయ్యను కొనియాడారు... అమరావతికి, తానూ భాగస్వామి అవ్వటానికి వచ్చినందుకు సంతోషం అన్నారు... కేంద్రం చేస్తున్న అన్యాయానికి, ప్రజల్లో ఎంత కసి ఉందో, ఈ ఘటనే నిదర్శనమని చంద్రబాబు అన్నారు..

మరో పక్క, ఇలాంటి వారిని చుసైనా, పవన్, జగన్, మనసు మార్చుకోవాలని, నిత్యం అమరావతి పై చేసే కుట్రలు ఆపాలి.. జగన్, విజయవాడ పాదయత్రకు వచ్చి, భ్రమరావతి అంటూ యెగతాళి చేసాడు.. మంగళగిరిలో పాదయాత్ర చేసినా, కూత వేటు దూరంలో ఉన్న అమరావతికి రావటానికి మాత్రం ఇష్టపడలేదు... ఇక జగన్ మీడియా, పార్టీ, అమరావతి పై చిమ్మే విషం గురించి చెప్పే పని లేదు... ఇక పవన్ విషయానికి వస్తే, ఐవైఆర్, ఉండవల్లి లాంటి వారితో కలిసి, ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తాకాలు వదులుతాడు.. అమరావతికి అన్ని ఎకరాలు ఎందుకు అంటాడు... వీరందరూ కలిసి, అదే స్టేజి పై, అమరావతి రైతుల త్యాగాలను కూడా అవహేళన చేస్తారు... కానీసం ఇలాంటి వారిని చూసైనా, బుద్ధి తెచ్చుకుని, రాజధానికి అడ్డు రాకుండా, సహకరిస్తారని ఆశిద్దాం..

Advertisements