ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. ఏకంగా డీజీపీ తమ ముందు హాజరు అయ్యి వివరణ ఇవ్వాలి అంటూ, హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు చూస్తే, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. ఒక మిస్సింగ్ కేసుకు సంబంధించి, హైకోర్ట్ ఇచ్చిన కీలక ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కు షాక్ ఇచ్చాయి. ఈ నెల 14న తమ ముందు హాజరుకావాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసుకు సంబందించిన విషయంలో తమ ముందు హాజరు కావాలని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. రెండు రోజులు గడువు ఇచ్చిన హైకోర్ట్, కచ్చితంగా ఫిబ్రవరి 14న తమ ముందు హాజరు కావాలని, డీజీపీ గౌతం సవాంగ్ కు స్పష్టం చేసింది. ఇక కేసు పూర్వాపరాలు విషయానికి వస్తే, విజయవాడకు చెందిన, రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని అనే ఇద్దరు వ్యక్తులను, విశాఖపట్నం నుంచి వచ్చిన పోలీసులు తీసుకు వెళ్ళారని ఆరోపణ. అలాగే, తమ న్యాయవాది ఇల్లు, కార్యయలల్లో కూడా పోలీసులు వచ్చి, సోదాలు చేసారని ఆరోపణ.

ఈ రెండు విషయాలకు సంబంధించి, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని, పోలీసులు విజయవాడ వచ్చి, అక్రమంగా అరెస్ట్ చేసారని, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ పిటీషన్ ధాఖలు చేసారు. అయితే ఆ పిటీషన్ ను హైకోర్ట్ విచారణకు స్వీకరించింది. విచారణకు స్వీకరించిన హైకోర్ట్, ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకుని. అంతే కాదు, జ్యుడీషియల్ విచారణ చెయ్యాలి అంటూ, హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. జ్యుడీషియల్ విచారణ చెయ్యాల్సిందిగా, విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జిని, హైకోర్ట్ నియమించింది. తమకు జరిగిన విషయం మొత్తం పై, పూర్తి నివేదిక ఇవ్వాలి అంటూ, హైకోర్ట్, విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జికి, కీలక ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఉత్తర్వులను పాటించిన, విశాఖ సీనియర్ సివిల్ జడ్జి జ్యుడీషియల్ విచారణ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను, హైకోర్ట్ కు సమర్పించారు. విశాఖ సీనియర్ సివిల్ జడ్జి నివేదికను పరిశీలించిన హైకోర్టు, ఆ నివెదికలోని అంశాలు ఆధారంగా, కీలక నిర్ణయం తీసుకుని. ఏకంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ తమ ముందు హాజరు కావలని, తమ ముందు హాజరు అయ్యి, వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అది కూడా రెండు రోజుల్లోనే హాజారు కావలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీని పై విపక్షాలు మండి పడుతున్నాయి. ఇది ప్రభుత్వానికి చెంప పెట్టు అని, మొన్న క్యాట్ ట్రిబ్యునల్ లో, చీఫ్ సెక్రెటరికి అక్షింతలు పడ్డాయని, ఇప్పుడు కోర్ట్ లో డీజీపీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుందో, ఈ ఉదాహరణలే నిదర్శనం అని ఆరోపిస్తున్నాయి.

Advertisements