రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా మాట్లాడతారో, వారికే తెలియదు. మధ్యలో పిచ్చోళ్ళు ఎవరు అంటే, వారిని గుడ్డిగా సమర్ధించే వారు, వారిని నమ్మే ప్రజలు. ఈ మధ్య ట్రెండ్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చెయ్యటం, అదే నిజం అని ప్రజలను నమ్మించటం. ప్రజలు కూడా, అది నిజమా అబద్ధమా, ఏ ఉద్దేశంతో అలా చెప్తున్నారు అనే ఆలోచనా శక్తి కోల్పుతున్నారు. ఇది మన రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఫేక్ న్యూస్ నిజం అని నమ్మించి మోసం చెయ్యటం, ఇక్కడ బాగా అలవాటు. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతున్నాం అంటూ మొదలు పెట్టారు. అయితే ఎన్నికల కోడ్ ఉంటూ ఉండగానే, ఉగాది రోజున ఇళ్ళ పట్టాల పంపిణీ చేస్తాం అని ప్రచారం చేసారు. ఎన్నికల కోడ్ ఉండగా, ఇలా కొత్త పధకం ఎలా తెస్తారు అంటూ, టిడిపి , విపక్షాలు ప్రశ్నించాయి. అయితే, టిడిపి పేదల ద్రోహి, పేదలకు పండుగ రోజు ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా, ఆపుతున్నారు, కోర్టుల్లో కేసులు వేస్తున్నారు అంటూ, వైసీపీ కింద స్థాయిలో ప్రచారం చేసింది.

ఇది ఇలా నడుస్తూ ఉండగానే, ఎన్నికల కమీషనర్ రామేశ్ కుమార్, కరోనా ఎక్కువ అవుతూ ఉండటంతో, కరోనా తగ్గే వరకు, ఎన్నికలు వాయిదా వేస్తున్నాం అని, ఆరు వారల పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. అయితే, ఎన్నికల కోడ్ అమలులోనే ఉంటుంది అని, పాత పధకాలకు ఇబ్బంది లేదని, కొత్త పధకాలు ఏమైనా పెట్టాలి అంటే, మా పర్మిషన్ తీసుకోవాలని చెప్పింది. అయితే, దీని పై వైసీపీ గోల గోల చేసింది. చంద్రబాబు కులం, రమేష్ కుమార్ కులం ఒక్కటే అనే, ఇద్దరు కలిసి పేదలకు అన్యాయం చేసారని, ఉగాది రోజున, మేము పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అనుకున్నాం, మొత్తం చెడగొట్టారు అంటూ ప్రచారం చేసారు. ఈ కేసు సుప్రీం కోర్టకు చేరింది. సుప్రీం కోర్ట్ ఎన్నికల కోడ్ ఎత్తి వేస్తూ, కొత్త పధకాలకు ఈసీ పర్మిషన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

అయితే ఇదే సమయంలో, ఈ రోజు ఉదయం, ఉగాది రోజున, ఇళ్ళ స్థలాల పంపిణీ చెయ్యటంలో మాకు అభ్యంతరం లేదు అంటూ, ఎన్నికల సంఘం లేఖ రాసింది. సుప్రీంకోర్టు 437/20 తీర్పును అనుసరించి, ఇళ్ళ స్థలాల పంపిణీ కొనసాగించవచ్చు అంటూ, ఈసీ ఈ రోజు ఉదయం చెప్పింది. అయితే, ఈసీ తమకు అనుకూలంగా రావటంతో, సహజంగా అయితే, వైసీపీ ఎగిరి గంతెయ్యాలి, కాని వైసీపీ, తూచ్ అంది. కోరనా బాగా ఉందని, ఉగాది రోజున మేము, ఇళ్ళ పట్టాలు చెయ్యలేమని, ఈ కార్యక్రమం వాయిదా వేస్తున్నామని, ఏప్రిల్ 14న, ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. అంతలా గోల గోల చేసిన వైసీపీ, ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇవ్వచ్చు అని చెప్పినా, అమ్మో మాకు కుదరదు, కరోనా ఉంది అని చెప్తూ, ఇప్పుడు వైసీపీ చెప్పింది అంటే, మొన్నటి దాక టిడిపి పై, ఈసీ పై చేసిన ప్రచారం, ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. గోల గోల చేసి, ఇప్పుడు సరే అని పర్మిషన్ ఇస్తే, తూచ్ అన్నారు.

Advertisements