జగన్ మోహన్ రెడ్డికి అక్రమ ఆస్తుల కేసులో, ఈడీ షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ళు ఆయన విచారణకు హాజరుకాకుండా, కోర్టు నుంచి ఎప్పటికప్పుడు పర్మిషన్ తీచ్చుకుంటున్నారు. ఇక మధ్యంలో క-రో-నా వల్ల కోర్టులు కూడా పని చేయలేదు. అయితే ఈ మధ్య రోజు వారీ విచారణ కూడా ప్రారంభం అయ్యింది. ఈ నేపధ్యంలోనే ఈడీ తాజాగా జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 11 వ తారీఖున కోర్ట్ కు హాజరు కావాలని జగన్ ను ఆదేశించారు. అరబిందో, హెరిటో భూకేటాయింపులు విషయంలో, ఈ చార్జ్ షీట్ ను, నాంపల్లి కోర్టు నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కోర్టుకు బదిలీ చేయటం జరిగింది. అయితే ఈ అరబిందో, హెరిటో భూకేటాయింపులకు సంబంధించి, భూములు కేటాయింపులకు ప్రతిఫలంగా, జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని దానికి సంబంధించిన, దాని మీద ఈ కేసు నమోదు అయ్యింది. దీని పై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అనేక సాక్ష్యధారాలు నమోదు అయిన నేపధ్యంలో, నాంపల్లి కోర్టు నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కు బదిలీ చేయాలనే పిటీషన్ కు స్పందించి, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఈ కేసుని తీసుకోవటం జరిగింది. దీంతో ఈ కేసుని విచారణకు తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, జగన్ కు సమన్లు జారీ చేసి కోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారే చేసింది. ఇక ఇదే కేసులో విజయసాయి రెడ్డి, హెరిటో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, శరత్ చంద్రా రెడ్డి కోర్టుకు రావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది.

jagan 09012021 2

ఇక మరో పక్క సిబిఐ చూస్తూ, విజయసాయి రెడ్డికి షాక్ ఇచ్చింది. విజయసాయి రెడ్డి పై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు మోపటం సరైన నిర్ణయమే అని సిబిఐ వాదించింది. జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులకు సంబంధించి తనకు సంబంధం లేదని విజయసాయి రెడ్డి డిశ్చార్జ్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీని పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. సిబిఐ తరుపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ,అవినీతి నిరోధక చట్టంలో ఉన్న సెక్షన్ 9, 13 విజయసాయి రెడ్డికి వర్తిస్తాయని చెప్పారు. ఆ సమయంలో విజయసాయి రెడ్డి ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌గా ఉన్నారని, అది పబ్లిక్‌ సర్వెంట్‌ కిందకే వస్తుందని, అవినీతి నిరోధక చట్టం కింద విజయసాయి రెడ్డిఐ బుక్ చేయవచ్చని అన్నారు. వాదనలు విన్న సిబిఐ కోర్టు, ఈ కేసుని ఈ నెల 12కు వాయిదా వేసింది. అయితే ఇప్పటికిప్పుడు జగన, విజయసాయి రెడ్డికి ఈ కేసులతో వచ్చే ముప్పు ఏమి లేదని చెప్పాలి. అయితే జగన్ కోర్టుకు వెళ్ళటానికి ఇష్ట పడటం లేదు కాబట్టి, ఏమవుతుందో చూడాలి.

Advertisements