రాష్ట్రంలో రావణరాక్షసపాలన సాగుతోందని, పథకాలు పేర్లుమార్చి ఆర్భాటంగా ప్రకటిస్తున్న ప్రభుత్వం, ఫీజు రీయింబర్స్ మెంట్ కు జగనన్న విద్యాదీవెన అంటూ పేరుమార్చిన సర్కారు, ఉన్నతవిద్యనభ్యసించే విద్యార్థులఫీజులు కళాశాలలకు చెల్లించడం లేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టంచేశారు. సోమవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఒక ఇంట్లో చదువుకునేపిల్లలు, ఇద్దరు ముగ్గురుంటే, ఈ ప్రభుత్వం ఒక్కరికే అరకొరగా ఫీజులు చెల్లిస్తోందని, రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్యకుప్రభుత్వ చెల్లింపుల కు ఏమాత్రం పొంతనలేదని బుచ్చయ్య చెప్పారు. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగుచక్రాల వాహనాలున్నా, విద్యుత్ వాడకం 300యూనిట్లు దాటినా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులను ప్రభుత్వం నిలిపివే స్తోందన్నారు. కేంద్రప్రభుత్వం విద్యార్థులకు చెల్లించే చెల్లింపులు 50శాతంవరకు ఉంటే, ఈప్రభుత్వం అంతా తానే చెల్లిస్తున్నట్లు చెప్పుకుంటోందన్నారు. తాడేపల్లి సౌధం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, భారతి సమక్షంలో విద్యార్థులుసహా, అన్నివర్గాల వారిని దోచుకునే ప్రక్రియ కొనసాగుతోందని ప్రజలంతా అనుకుంటున్నారని టీడీపీ నేత స్పష్టంచేశారు. ప్రతిదానిలో కమీషన్లు తీసుకుం టూ, ప్రతిశాఖలో తనవాళ్లనునియమించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి దోపిడీని నిరాటంకంగా కొనసాగిస్తున్నా డన్నారు. విద్యార్థులకు మెస్ ఫీజులు, హాస్టల్ ఫీజులు చెల్లించడంలేదని, విదేశాల్లో చదువుకుంటున్నవారికి రూపాయికూడా చెల్లించకపోవడంతో వారంతా దిక్కుతో చని స్థితిలోఉన్నారని గోరంట్ల వెల్లడించారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా విద్యారంగానికి కేటాయింపులు చేయకుండా, గతప్రభుత్వం చెల్లింపులు చేయలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆన్ గోయింగ్ స్కీములకు చెల్లింపులు అనేవి ఆర్థికసంవత్సరం ఆరంభంలో చెల్లి స్తుంటారని, 2019 మేలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇంతవరకు విద్యార్థులకు పూర్తిగా హాస్టల్ ఫీజులు, బోధనా రుసుములు చెల్లించలేదన్నారు. భోజ న కాంట్రాక్టర్లకుచెల్లింపులు చేయకపోవడంతో విద్యార్థు లు అర్థాకలితో అలమటిస్తున్నారన్నారు.

14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎన్ఆర్ ఈజీఎస్ నిధులను పంచాయతీలకు కేటాయించకుండా, పంచాయతీ రాజ్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యంచేసిందన్నారు. ఆ శాఖ మంత్రి దొంగఓట్లు వేయించుకునే పనిలో తీరిక లేకుండాఉంటే, గ్రామపంచాయతీల్లో సెక్రటరీలు, వీఆర్వోలు విద్యుత్ బకాయిలుకూడా చెల్లించలేక బావురుమంటున్నారని చౌదరి వివరించారు. పంచాయ తీలకు దక్కాల్సిన ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు ఈప్రభు త్వం పక్కదారి పట్టించిందని, దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు బయటకువస్తాయని గోరంట్ల డిమాండ్ చేశారు. గ్రామాల్లో అభివృద్ధిపనులు చేయడానికి ఎవరూ ముందుకురాని పరిస్థితిని ఈ ప్రభు త్వం కల్పించిందన్నారు. సీఎఫ్ఎంఎస్ విధానంతో గ్రా మాల అభివృద్ధిని అటకెక్కించిన జగన్ ప్రభుత్వం, ఇళ్ల స్థలాలు, సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలంటూ ప్రజలను మరింతదోపిడీ చేస్తోందన్నారు. ఇళ్లస్థలాల పేరుతో వైసీపీనేతలు, కార్యకర్తలు దోచుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం, ఎక్కడాకూడా పేదలు, సామాన్యు లకు ఉపయోగపడేవిధంగా స్థలాలనుకేటాయించలేక పోయిందన్నారు. ఒక్కచోట కూడా నీటివసతి, రోడ్డు వసతి కల్పించడంగానీ, ఇళ్లనిర్మాణంచేయడం గానీ జరగలేదన్నారు. ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇస్తుంద నిచెప్పిన పాలకులు, సిగ్గులేకుంగా గతప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులేస్తోందని బుచ్చ య్య మండిపడ్డారు. టిడ్కోఇళ్లను లబ్ధిదారులకు కేటాయించని ముఖ్యమంత్రి వాటికి పార్టీరంగులేసి తనబొమ్మను, తనతండ్రి బొమ్మలను వేసుకుంటున్నా డన్నారు.

గ్రామాల్లో పనులుచేస్తే బిల్లులు చెల్లించరన్న భయంతో వైసీపీవారే ఎటువంటి పనులుచేయడానికి ముందుకురావడంలేదన్నారు. రాజమండ్రి చుట్టుపక్క లున్న పల్లెల్లోనివారికి ఇసుక లభించడంలేదని, విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న ఇసుకను విశాఖకు లారీలు,లారీలు తరలిస్తున్నారన్నారు. కొవ్వూరు ప్రాంతంనుంచి కొన్నివేల ట్రక్కుల ఇసుక సజ్జల ఆధ్వర్యంలో ఇతరప్రాంతాలకు తరలిపోతోందన్నా రు. ఈ ప్రభుత్వంలో జరుగుతన్న అధ్వాన్న, ఆటవిక, అరాచక పాలనతో ప్రజలంతా ఈసురోమంటూ ఏడుస్తు న్నారన్నారు. పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందు కు రావడంలేదని, ఉన్నపరిశ్రమలు ఈరోజా ..రేపా అన్నట్లుగా తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అధికారజులుం, ప్రభుత్వదోపిడీతో ఏపీలోని పరిశ్రమల న్నీ తెలంగాణకు తరలిపోతున్నాయన్నారు. ఒకచేత్తో రూపాయిఇస్తూ, మరోచేత్తోప్రజలనుంచి 10రూపాయలు లాగేసుకుంటున్న దోపిడీ ప్రభుత్వం దేశంలో జగన్ ప్రభుత్వం ఒక్కటేనని బుచ్చయ్య చౌదరి తేల్చిచెప్పారు. మద్యం అమ్మకాలను వైసీపీనేతలకు ఆదాయవనరుగా మార్చారని, మద్యపాన నిషేధం పేరుతో గ్రామాల్లో సారాయిని ఏరులైపారిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలన్నారు. తనపార్టీ నాయకులు, కార్యకర్తలను గ్రామాలపైకి వదిలి, ముఖ్యమంత్రి అక్రమ మద్యం, సారాయి వ్యాపారాలను చేయిస్తున్నాడన్నారు. ప్రతిగ్రామం సారాయి డెన్ గా మారిందన్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రశ్నించేవారిని, ప్రతిపక్షాలను అడ్డుకుంటూ, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాడని గోరంట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisements