మూడు ముక్కల రాజధాని పై, అమరావతి రైతులు హైకోర్ట్ గడప తోక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున, వాదనలు వినిపించటానికి, రూ.5 కోట్లు ఖర్చు పెట్టి మరీ, ఒక సీనియర్ లాయర్ ని ఢిల్లీ నుంచి తీసుకు వచ్చారు జగన్. అయితే, ఏకంగా 5 కోట్లు ఒక లాయర్ కి, ప్రజాధనం ఇవ్వటం పై, అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని, ఈ కేసు కోసం జగన్ తీసుకు వచ్చారు. 5 కోట్లు ఆయన ఫీజు అంటూ జీవో ఇచ్చారు. ఇప్పటికే ఒక కోటి అడ్వాన్స్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం తరుపున, ముకుల్ రోహత్గి నియామకాన్ని సవాల్ చేస్తూ ఆర్ శివాజీ అనే న్యాయవాది, హైకోర్ట్ లో పిల్ వేసారు. ప్రభుత్వం తరఫున రోహత్గిని నియమించడం అడ్వొకేట్ చట్టానికి విరుద్ధమని పిల్ లో పేర్కొన్నారు. అయితే ఈ కేసును హైకోర్ట్ పరిగణలోకి తీసుకోదని, వైసీపీ పార్టీ భావించింది. కాని, అనూహ్యంగా హైకోర్ట్, ముకుల్ రోహత్గీకి నోటీసులు జరీ చేసింది. ఈ విషయం, పై సమాధానం చెప్పాలి అంటూ, ఆయనకు నోటీసులు ఇస్తూ, కేసును వాయిదా వేసింది.

మరో పక్క, రాజధాని గ్రామాల్లో 55 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతులు ఇప్పుడు న్యాయస్థానం వైపు చూస్తున్నారు. రాయప వాడిలో సోమవారం ఆందోళనకారులు వినూత్న నిరసన తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రెండువైపులా నిల్చుని దండం పెడుతూ నిలబడ్డారు. న్యాయం చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శిం చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ న్యాయస్థానం తమకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మరో వైపు కృష్ణాయపాలెం శివాలయం సెంటరులో ప్రయాణి కులు గులాబీపూలు పంచుతూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. మరో వైపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రైతులు శిబిరాల వద్దకు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. మందడం, రాయపూడి, వెలగ పూడి, తుళ్ళూరు. కృష్ణాయ పాలెం తదితర గ్రామాల్లో ఆందోళన శిబిరాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఈ శిబిరాలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రైతులు వచ్చి మద్దతు పలుకు తున్నారు. సోమవారం టిడిపి సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు గోరం ట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి రైతులు వెలగపూడి శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. రాజధాని గ్రామాల రైతుల త్యాగా లను విస్మరించటం చారిత్రక తప్పిద మని ఈ సందర్భంగా రైతులు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఫ్యాక్షన్ సంస్కృతితో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ భూములిచ్చిన రైతులపై కక్ష సాధింపు చేస్తున్నాడని విమర్శించారు. రాజధాని కోసం ఇచ్చిన భూములను వెనక్కి ఎలా ఇస్తారు...వాటిని వ్యవసాయయోగ్యం గా మార్చి తిరిగి ఇవ్వటం సాధ్యపడు తుందా అని ప్రశ్నించారు. తమ ప్రాంతానికి రాజధాని వస్తుం దంటే విశాఖవాసులకు భయమేస్తుందన్నారు. రాజధాని విషయంలో కేంద్రం స్పందించకపోయినా న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Advertisements