జగన్మోహన్ రెడ్డి తన అబద్ధాల చిట్టాకు, సంక్షేమ క్యాలెండర్ అనే పేరుపెడితే, మంత్రులేమో అబద్ధాలతోఊదరగొడుతూ, దేశంలో ఎక్కడా ఇటువంటి పథకాలు అమలుకావడంలేదని చెప్పడం సిగ్గుచేటని టీడీపీనేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహంవ్యక్తంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. సంక్షేమ క్యాలెండర్ పేరులో మంత్రులు సిగ్గులేకుండా, ప్రజలు ఏమనుకుంటారోనన్న ఆలోచన లేకుండా అబద్ధాలమీద అబద్ధాలు చెబుతున్నారని మర్రెడ్డి మండిపడ్డారు. గోరంత సాయం చేస్తూ, కొండంతప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి, మంత్రులను ఈ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. జగన్ అబద్ధాల ప్రచారమనేది సాక్షి మీడియాతోసహా, బ్లూమీడియా మొత్తం భారీస్థాయిలో ఊదర గొడుతోందన్నారు. అమ్మఒడి పథకం పేరుతో రూ.14వేలిస్తున్న జగన్ , అయ్యబుడ్డిద్వారా రూ.36వేలుకాజేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాడో, పన్నులు ఎలా పెంచాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. సంవత్సరానికి రూ.5వేలకోట్లు లిక్కర్ వ్యాపారంలో దోచుకుంటున్న ముఖ్యమంత్రి ఎటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అమలుచేస్తున్నాడో చెప్పాలన్నా రు. సిమెంట్ కంపెనీలను సిండికేట్ చేసిన జగన్, తద్వారా ఎంత ఆర్జిస్తున్నాడో చెప్పాలన్నారు. మద్యంరేట్లను ఇష్టానుసారం పెంచిన జగన్, అన్నాక్యాంటీన్లను తొలగించడంతోపాటు, నిరుద్యోగ భృతిని రద్దుచేశాడన్నారు. విదేశీవిద్యకు ఇచ్చే చెల్లింపులను కూడా తొలగించాడన్నారు. టీడీపీప్రభుత్వం అమలుచేసిన 36సంక్షేమ పథకాలను రద్దుచేసిన జగన్, కొత్తగా సంక్షేమపథకాల క్యాలెండర్ విడుదలచేస్తున్నానంటూ డబ్బాలు కొట్టుకునే పని మొదలుపెట్టా డని మర్రెడ్డి ఎద్దేవాచేశారు.

జగన్ కు తానొక బహిరంగ సవాల్ విసురుతున్నానన్న శ్రీనివాస రెడ్డి, రాష్ట్రంలో 5కోట్లమంది జనాభాఉంటే, 5కోట్ల1లక్షమందికి తన సంక్షేమక్యాలెండర్ అమలుచేయబోతున్నట్టు ముఖ్యమంత్రి నేడు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడన్నారు. ఆయన ప్రకటనలకు, వాస్తవానికి ఎక్కడైనా పొంతనకుదురుతుందా అని టీడీపీనేత ప్రశ్నించారు. జగన్ ప్రకటనలు నమ్మడానికి ఏమాత్రమైనా అవకాశ ముందా అని శ్రీనివాసరెడ్డి నిలదీశారు. విద్యారుణాలు, 2019 రబీ, 2020ఖరీఫ్, 2020 రబీకిరుణాలు ఇస్తాననడం విడ్డూరంగా ఉంద న్నారు. అయిపోయిన 2019 రబీకి ఇప్పుడు రుణం ఇస్తున్నట్లు, తద్వారా కోటి20లక్షల మంది రైతాంగానికి మేలుచేస్తున్నట్లు ప్రకటనల్లో చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా,ప్రజలు నిలదీస్తారనే ఇంగితంలేకుండా బాకాలు ఊదడం ఎంతమాత్రం మం చిదికాదన్నారు. ఎన్నికలువచ్చినప్పుడే, జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంక్షేమం గుర్తుకొస్తుందన్నారు. ప్రభుత్వ ఖజానాలోని సొమ్ముని, తన సొంతఖజానాకు బదిలీచేసుకోవడానికే జగన్మోహన్ రెడ్డి పథకా లు అమలుచేస్తున్నాడుతప్ప, ప్రజల మేలుకోసం కాదని శ్రీనివాస రెడ్డి తేల్చిచెప్పారు. అమ్మఒడికి ఇచ్చిన సొమ్ముని తల్లులు వివిధ రూపాల్లో దుర్వినియోగంచేస్తుంటే, విద్యార్థుల చదువులుఎలా కొనసాగుతాయన్నారు. అమ్మఒడిద్వారా జగన్ ఇచ్చే రూ.14వేల సొమ్ము, 80శాతానికి పైగా తిరిగి సారాకొట్లద్వారా జగన్ సొంత ఖజానాకే చేరుతున్నాయన్నారు. ప్రభుత్వ ధనాన్ని లూఠీచేయడా నికి, అవినీతిపరుడిననే ముద్ర పోగోట్టుకోవడానికే, జగన్ ప్రభుత్వ సొమ్ముని పథకాలపేరుతో సొంతఖజానాకు చేర్చుకుంటున్నాడన్నా రు. ఇళ్లపట్టాల పంపిణీపేరుతో తక్కువధరకు భూములుకొని, వాటిని ఎక్కవధరకుప్రభుత్వానికి అంటగట్టిన జగన్, వాహనమిత్ర పేరుతో డ్రైవర్లకు రూ.10వేలుఇచ్చినట్లేఇచ్చి, తెల్లారగానే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేశాడన్నారు. అంతటితోఆగకుండా, ఆర్టీవో అధికారులతో తప్పుడుకేసులుపెట్టించి, వాహనదారులనుంచి పదికి పది అదనంగా వసూలుచేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిం దన్నారు. 2019, 2020లో రైతులు తీసుకున్నరుణాలకు సున్నా వడ్డీని ఇంతవరకు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో 15లక్షలమంది కౌలు రైతులుంటే, వారికిసున్నావడ్డీ పథకంతోపాటు, రుణ సౌకర్యమే లేకుండా పోయిందన్నారు.

కౌలురైతుల సంఖ్యను లక్షకు కుదించి, వారికి ఎటువంటిరుణం అందకుండాచేశాడన్నారు ఒక రైతుకు రెండేళ్లకు ఇచ్చేమొత్తాన్ని ఒకక్యాలెండర్ లో ప్రకటించి, వారికి మేలుచేస్తున్నట్లు జగన్ చెప్పుకుంటున్నాడన్నారు. నిత్యా వసరాల ధరలు విపరీతంగా పెంచిన జగన్, బ్లాక్ మార్కెట్ ను అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నాడన్నారు. ఇసుకలేక ఉపాధిదొరక్క కార్మికులు రోడ్డునపడితే, వారి సంక్షేమ నిధిసొమ్ము నికూడా జగన్ దిగమింగాడన్నారు. వడ్డీలేని డ్వాక్రారుణాలు పొంద డానికి రాష్ట్రంలో ఎన్నిడ్వాక్రా గ్రూపులు అర్హత సాధిస్తున్నాయో, ఇచ్చేసొమ్ముకి ఎన్ని కొర్రీలు పెడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. దర్జీలకు, రజకులకు, నాయీబ్రాహ్మణులకు గతంలో టీడీపీ ప్రభుత్వం చేయూత, ఆదరణ పథకాల పేరుతో రూ.లక్షవరకు ఇస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రూ.10వేలు చేతిలో పెట్టి సంక్షేమపథకాలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడన్నారు. విదేశాలకువెళ్లి చదువుకునే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ విద్యార్థు లకు చంద్రబాబుప్రభుత్వం రూ.10లక్షలవరకు రుణమిస్తే, దాన్ని జగన్ రద్దుచేశాడన్నారు. జీవోనెం-77పేరుతో విద్యార్థులకు ఇవ్వా ల్సిన ఫీజురీయింబర్స్ మెంట్ ను కూడా ముఖ్యమంత్రి తొలగించా డన్నారు. ఈవిధంగా అనేకపథకాలు రద్దుచేయడం, ఉన్నవాటికి కోతలు పెట్టడం, లబ్ధిదారులసంఖ్యను కుదించడం చేసిన ముఖ్య మంత్రి, ఇప్పుడు ఉన్నజనాభాకంటే ఎక్కువమందికి సంక్షేమ పథ కాలు అమలుచేస్తానని చెప్పడం మోసగించడం కాక మరేమిటని శ్రీనివాసరెడ్డి నిలదీశారు. చేసేదేదో, చేయగలిగింది ఏదో ప్రజలకు స్పష్టంగా చెప్పకుండా, లబ్ధిదారుల సంఖ్యను ఎక్కువగా చూపు తూ, ప్రజలను మోసగించే చర్యలకు జగన్ ఇప్పటికైనా స్వస్తి పలికి తే మంచిదన్నారు. ఆరోగ్యశ్రీ, ఆసరా, గృహనిర్మాణం, ఆదరణ, విదేశీ విద్య, రేషన్ సరుకుల పంపిణీ వంటి అనేక పథకాలను చంద్ర బాబునాయుడుఎలా అమలుచేశాడో ఒక్కసారి వైసీపీ ప్రభుత్వం ఆలోచనచేస్తే మంచిదన్నారు. సంక్షేమపథకాల క్యాలెండర్ పేరుతో ప్రజలనుమోసగించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని టీడీపీనే త హెచ్చరించారు.

Advertisements