వైసీపీకి గ‌త ఎన్నిక‌ల్లో అత్య‌ధిక సీట్ల‌లో రావ‌డానికి బావ బ్ర‌ద‌ర్ అనిల్ కూడా ముఖ్య‌పాత్ర పోషించారు. చెల్లెలు ష‌ర్మిల‌కి ఆస్తులలో న్యాయంగా రావాల్సిన వాటాలు ఇవ్వ‌కుండా జ‌గ‌న్ థ్రెట్ ఇస్తుండడంతో వారు దూరం అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో అన్న వ‌దిలిన బాణాన్ని అంటూ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన ష‌ర్మిల‌, ఇప్పుడు అన్న‌పైకి వ‌దిలిన బాణంగా మారింది. జ‌గ‌న్ బావ బ్ర‌ద‌ర్ అనిల్ ఏపీలో ప‌ర్య‌టిస్తూ, వైసీపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసేలా త‌నకి ప‌ట్టున్న వ‌ర్గాల‌కి దిశానిర్దేశం చేస్తున్నారు. శ‌త్రువుకి శ‌త్రువు మిత్రుడు అనే సూత్రంని ఫాలో అవుతూ జ‌గ‌న్ రెడ్డి కొత్త మిత్రుడిని రంగంలోకి దింపాడు. అల్లుడు బ్ర‌ద‌ర్ అనిల్ కోసం మామ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విదేశాల నుంచి ఏపీలో మారుమూల ప‌ల్లెల‌వ‌ర‌కూ టార్గెట్ చేసి మ‌రీ కేఏ పాల్ ని ర‌క‌ర‌కాల కేసుల్లో ఇరికించేశారు. వేల‌కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. చివ‌రికి కేఏ పాల్ మాన‌సిక స్థితిపై అనుమానాలు రేపి పిచ్చోడిని చేసి జ‌నాల్లోకి వ‌దిలేశారు. త‌న తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి దెబ్బ‌కి పిచ్చోడు అయిన కేఏ పాల్ ని ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ రెడ్డి చేర‌దీస్తున్నాడు. బ్ర‌ద‌ర్ అనిల్ చేయ‌బోయే న‌ష్టాన్ని కేఏ పాల్ క‌వ‌ర్ చేస్తార‌నే ఆశ‌తో ఉన్నారు వైసీపీ వ్యూహ‌క‌ర్త‌లు. అయితే త‌న తండ్రి దెబ్బ‌కి జ‌నంలో కామెడీ పీస్ అయిన కేఏ పాల్ ని జ‌నం అంతా జోక‌ర్లా చూస్తున్నారు. అటువంటి కేఏ పాల్ ని దింపి టిడిపిని టార్గెట్ చేయాల‌నుకోవ‌డం హాస్యాస్ప‌ద‌మైన ఎత్తుగ‌డ అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

Advertisements