నరేంద్ర మోడీ పై దూకుడు పెంచిన చంద్రబాబు, గేర్ మారుస్తున్నారు... ముఖ్యామంత్రి హోదాలో, కేంద్రం పై నిరసన తెలుపుతూ, తన పుట్టిన రోజు నాడు దీక్ష చేసిన చంద్రబాబు, ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి, మోడీ మోసం పై ప్రజలకు వీడియోలు, డాక్యుమెంట్ లు చూపించి మరీ, ఎండగట్టనున్నారు... అయితే, ఈ నెల 7న అమరావతిలో, బీజేపీ యేతర పార్టీలు అన్నీ సమావేశం కానున్నాయి... ఇదే సమావేశంలో, చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ ప్రకటన చేస్తారని, నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... మే 7న అమరావతిలో జకీయంగానే కాకుండా, రాష్ట్రాలకు చేస్తున్న వివక్ష పై, అన్ని రాష్ట్రాలని చంద్రబాబు ఏకం చేస్తున్నారు...

ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలను ఒక్కతాటి పై తెచ్చిన చంద్రబాబు, ఈ సారి దేశంలో వివిక్షకు గురవుతున్న మిగతా రాష్ట్రాలను కూడా రమ్మని కబురు పంపించారు.. మే 7న విజయవాడలో ఈ సమావేశం జరగనుంది... అయితే ఈ సమావేశం జరిగితే, అన్ని రాష్ట్రాలకు మోడీ చూపిస్తున్న వివక్ష క్లియర్ గా ప్రజలకు చెప్పనున్నారు... ఇది కర్ణాటక ఎన్నికల పై కూడా పడుతుంది.. అంతే కాదు, బీజేపీ యేతర రాష్ట్రాలను చంద్రబాబు ఏకం చేసి, ఒక ఫ్రంట్ ని కూడా ప్రకతిస్తారు అనే వార్తలు వస్తున్నాయి... దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఇటీవల తిరువనంతపురంలో భేటీ కాగా, రెండో భేటీని విజయవాడ వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు..

అయితే ఈసారి దేశంలోని అన్ని బిజెపియేతర రాష్ట్రాలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి పోరాటాన్ని ఉధృతం చేయాలని సంకల్పించారు. ఈ బాధ్యతను ఎపి రాష్ట్ర ఆర్థిక శాఖకు అప్పగించారు. దీంతో ఇతర రాష్ట్రాలను ఆహ్వానించే పనిలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు బిజీ అయ్యారు. ఈసారి చర్చల్లో ఆర్ధిక నిపుణులను కూడా భాగస్వాములను చేస్తూ వారినీ ఆహ్వానిస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఆర్ధికంగా నష్టపోతున్న నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు, అధికారులు తిరువనంతపురంలో భేటీ అయిన సందర్భంలో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు గైర్హాజరయ్యాయి. తొలుత విశాఖపట్నంలో ఈ భేటీని నిర్వహించాలనుకున్నా, చివరిగా విజయవాడకు వేదికను మార్పు చేశారు. ఈ భేటీకి కొత్తగా ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మిజోరాం రాష్ట్రాలను కూడా ఆహ్వానించారు... మరో నేషనల్ మీడియాలో వస్తున్నట్టు, ఆ రోజు చంద్రబాబు, కొత్త ఫ్రంట్ గురించి ప్రకటన చేస్తారా అనేది చూడాల్సి ఉంది...

Advertisements