విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో డా.రమేశ్ బాబు పోలీస్ కస్టడీపై ఆస్పత్రి మేనేజర్ రాజశేఖర్ వివరణ ఇచ్చారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం విజ్ఞప్తి మేరకు కోవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు మొట్టమొదటగా మా ఆస్పత్రి ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. అయితే స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కోవిడ్ సెంటర్ నడిపేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అనుమతిచ్చారని స్పష్టం చేసారు. రోగులకు సౌకర్యాల కల్పన, అద్దె వసూలు చేసుకునే విధంగా స్వర్ణ ప్యాలెస్ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఒప్పందం చేసుకున్నారాని అన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించాం అని తెలిపారు, రమేష్ ఆస్పత్రి మేనేజర్ రాజశేఖర్. అగ్ని ప్రమాదంలో, వైద్యం చేయటానికి వచ్చిన రమేష్ హాస్పిటల్స్ కు సంబంధం ఉండదని, పర్మిషన్ ఇచ్చిన అధికారులకు, అలాగే హోటల్ యాజమాన్యానికి సంబంధం ఉంటుందని, ఇప్పటికే కోర్టులో వాదనలు వినిపించారు.

Advertisements