క-రో-నా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తుంది. ఎవరినీ వదలిపెట్టటం లేదు. ప్రముఖలను కూడా ఈ సెకండ్ వేవ్ బారి నుంచి తప్పించుకోలేక పోతున్నారు. తాజాగా మాజీ ఎంపీ సబ్బం హరి క-రో-నా బారిన పడ్డారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఈ రోజు విషమంగా ఉన్నాట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మూడు రోజుల క్రితం, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోక పోవటంతో, విశాఖపట్నంలోని ఒక ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్ లో చేరారు. అయితే ఈ రోజు సాయంత్రం నుంచి ఆయన ఆరోగ్యం విషమించినట్టు చెప్తున్నారు. ఆక్సిజన్ లెవెల్స్ తేడాలు వస్తూ ఉండటంతో, ఆయనకు వెంటిలేటర్ అమర్చి వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఆయనకు కో-ర-నా సోకినట్టు అభిమానులకు కూడా తెలియకపోవటం, ఒక్కసారిగా ఈ వార్త రావటంతో, అందరూ షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై వైద్యం కొనసాగుతుంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, కోరుకుందాం.

Advertisements