గ్రీవెన్స్ సెల్‍లో  జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేసారు. తాడిపత్రిలోని ప్రభుత్వ భూములను కొందరు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని  జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్‍కు ఫిర్యాదు చేసారు.  ఈ భూ ఆక్రమణ దందా అంతా రెవెన్యూ అధికారుల సహకారంతో నే జరిగిందని  ఆయన ఆరోపించారు. గతంలో మున్సిపాలిటీకి ధారాదత్తం చేసిన భూములను రిజిస్టర్ చేసుకోవడంపై జేసీ మండి పడ్డారు.దీని గురించి  గ్రీవెన్స్ సెల్‍లో  జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేయగా కలెక్టర్  విచారణకు 15 రోజుల గడువు కోరారు. ఈ  15 రోజుల తర్వాత దీని పై  ప్రభుత్వం స్పందించక పోతే  ప్రత్యక్ష ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ భూ ఆక్రమణల్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి హస్తం కూడా ఉందని జేసీ ఆరోపించారు.

Advertisements