తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, చంద్రబాబు నాయుడు, ఈ రోజు తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గున్నారు. అయితే చంద్రబాబు ప్రసంగం అడ్డుకోవటానికి అరాచక శక్తులు రెచ్చిపోయాయి. చంద్రబాబు ప్రచారం చేస్తూ ఉండగా, చంద్రబాబు లక్ష్యంగా ఆయన పై రాళ్ళ దా-డి చేసారు. అయితే ఆ రాళ్ళు చంద్రబాబుకి తగలకుండా, కింద ఉన్న ప్రజల పై పడ్డాయి. చంద్రబాబు ప్రసంగం చేస్తున్న పక్క బిల్డింగ్ లో పై నుంచి పెద్ద సైజు గులక రాళ్ళు వచ్చి పడ్డాయి. దీంతో కొంత మందికి గాయాలు అయ్యాయి. ఈ పరిణామంతో చంద్రబాబు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. మీ రౌడీయిజం చెల్లదు అంటూ చంద్రబాబు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. నాకే రక్షణ లేకపోతే, ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి అంటూ, నిలదీశారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న తనపైనే ఇలా దాడి చేస్తే ఇంకా ఎవరికీ చెప్పుకోవాలని అన్నారు. తన పై వేసిన రాళ్ళు తీసుకుని, ప్రజలకు చూపించారు. దాడి జరిగిన వారితో మాట్లాడించారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏకంగా రెండు మూడు రాళ్ళు విసరటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. సభకు పోలీసులు రక్షణ కల్పించలేదని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

cbn stones 12042021 2

పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కేంద్ర పరిధిలో జరిగే ఎన్నికలు ఇవి అని, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే తోక కట్ చేస్తాం అని అన్నారు. అంతకు ముందు చంద్రబాబు ప్రసంగిస్తూ, రెండేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డాం, అభివృద్ధి భావితరాలకు అందాలి , టీడీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించాం, తిరుపతిలోనే విద్యనభ్యసించా, తిరుపతి ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది, సీఎం పదవి నాకు కొత్తకాదు, ప్రజల కోసం నిరంతరం పోరాడే వ్యక్తిని, , టీడీపీ అంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం, 2029 నాటికి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలనుకున్నా, తిరుపతి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన ఘనత ఎన్టీఆర్‍కే దక్కుతుంది, తిరుపతిని విద్యాకేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించా, టీడీపీ హయాంలోనే తిరుపతి అభివృద్ధి - రాష్ట్రాన్ని వైసీపీ విధ్వంసం చేస్తోంది - ప్రత్యేక హోదాపై జగన్ అబద్ధపు మాటలు చెప్పాడు, ఏపీలో అభివృద్ధి ఆగింది, రౌ-డీ-యి-జం పెరిగింది అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

Advertisements