సింగిల్ సింహంని ఓట‌మి భ‌యం వెంటాడుతోంది. వై నాట్175 ఏమో కానీ 17 కూడా వ‌స్తాయో రావో కూడా డౌట్ కొట్టేస్తోంది. చేతిలో అధికారం మాత్రమే ఉంది. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్య‌ ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌నే అప‌హాస్యం చేసేలా బ‌రితెగిస్తున్నార‌నే రోజుకొక విస్తుగొలిపే ఓట్ల స్కాం బ‌య‌ట‌ప‌డుతోంది. టిడిపి గెలిచే చోట వారి సానుభూతిప‌రుల ఓట్ల తీసివేత‌, వైసీపీ ఓడిపోయే చోట దొంగ ఓట్లు చేర్పించ‌డం ఇదే రాష్ట్ర‌మంతా సాగిస్తోంది వైసీపీ.
విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలో వార్డులు, బూతులవారీగా టిడిపి సానుభూతిప‌రుల ఓట్ల గల్లంతుపై టిడిపి ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు క‌లెక్ట‌ర్‌కి ఫిర్యాదు చేయ‌డంతో ఈ స్కాం వెలుగు చూసింది. ఇంటింటికి వెళ్లి పరిశీలించకుండా ఓట్లు తొలగించారని, దాదాపు 40 వేల ఓట్లు తొలగించార‌ని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.గుంటూరు పట్టాభిపురం 36 డివిజన్ లోని ఒకే డోర్ నెం. తో123ఓట్లు, అదే ఇంటి నెంబర్ తో33వ డివిజన్ పండరిపురం లో300ల ఓట్లు చేర్పించిన అధికారుల గుట్టుని టిడిపి నేత‌లు ర‌ట్టు చేశారు. గతంలో నివాసాలుగా ఉండి, నేడు స్కూల్ గా మార్చిన 36వ డివిజన్ లోని భవనంలో137ఓట్లను చేర్చించిన కార్పొరేషన్ అధికారుల అక్ర‌మాల‌ను ఆధారాల‌తో స‌హా టిడిపి నేతలు బ‌య‌ట‌పెట్టారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇలా వైసీపీ వంద‌ల సంఖ్య‌లో దొంగ ఓట్లు చేర్పించిన వైనంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కార్పొరేష‌న్ అధికారుల‌కి ఫిర్యాదు చేశారు.

Advertisements