రాజకీయంలో అధికారమదం తలెకెక్కిన తర్వాత బందువుల్ని, రక్త సంబందీకుల్ని, స్నేహితుల్ని మరచిపోతారనేదానికి ముఖ్యమంత్రి జగనే ప్రత్యక్ష నిదర్శనం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖేష్ అంబానితో ముఖ్యమంత్రి జగన్ భేటీ అందరకీ ఆశ్చర్యం కల్గిస్తోంది. నిన్న భేటీలో అంబానీని, ఆయన కుమారుడ్ని జగన్ కల్మషం లేని నవ్వుతో ఆప్యాయంగా ఆహ్వానించిన తీరు, ఖరీదైన శాలువ కప్పడం, ఆయన వారి పట్ల చూపించిన అభిమానం అందరికీ ఆశ్చర్యం కల్గించింది., నాడు వైయస్ మరణం వెనుక రిలయన్స్ సంస్ధ కుట్ర ఉందంటూ ఉమ్మడి రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో రిలయన్స్ సంస్ధలపై జగన్ దా-డు-లు చేయించి వి-ద్వం-స కాండ సృషించారు. వైయస్ హ-త్య వెనుక రిలయన్స్ హస్తముందని జగన్ అన్న మాటలు నిజమే అయితే నేడు ముఖేష్ అంబానీని ఆప్యాయంగా జగన్ నవ్వుతూ స్వాగతించటం ఏంటి? తండ్రి శ-వం ఇంటికి చేరకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేశారనే అపవాదు జగన్ పై ఉంది.

నాడు రిలయన్స్ సంస్ధలపై జగన్ దా-డు-లు చేయించటం వాస్తవం కాదా? జగన్ కి అత్యంత సన్నిహితుడు కాంగ్రెస్ పార్టీ విధ్యార్ది నాయకుడు వంశీచందర్ రెడ్డి రిలయన్స్ పై దా-డు-ల-కు పురిగొల్పుతూ మెసేజ్ లు పెట్టింది వాస్తవం కాదా? ఉమ్మడి రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో రియలన్స్ సంస్ధలపై జరిగిన దా-డు-ల-కు కారణం జగన్ కాదా? అంటూ ప్రశ్నించారు. ఆ దా-డు-ల-కు సంబందించిన ప్రతికల్లో వచ్చిన పోటోలను మీడియా ముందు ప్రదర్శించారు. నాడు జగన్ ఇచ్చిన పిలుపుతో రిలయన్స్ సంస్దలపై దా-డు-లు చేసిన వేలాదిమంది అమాయకులు ఇప్పటికీ జైళ్లలో ఉన్నారు, మరికొంత మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, వేలాది మంది పోలీసుల చేత బూటు దెబ్బలు తిన్నారు, వారి బంగారు భవిష్యత్ ని నాశనం చేసుకున్నారు, కానీ నేడు అంబానీనీ ఆప్యాయంగా హత్తుకున్న జగన్ వారి కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్తారు? నాడు రిలయన్స్ సంస్ధల్ని ద్వం-సం చేయండి అన్న జగన్ నేడు అదే రిలయన్స్ అధినేతతో భేటీ అవటం ఏంటి? మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ దీనికి ఏం సమాధానం చెప్తారు. రిలయన్స్ సంస్ధ మరియు సోనియా గాంధీ కుటుంబం కుమ్మక్కై వైయస్ రాజశేఖర్ రెడ్డిని హ-త్య చేయించారని వైయస్ కుటుంబానికి సన్నిహితుడైన భూమణ కరుణాకర్ రెడ్డి నాడు చెప్పలేదా?

వైయస్ మరణం వెనుక రిలయన్స్ హస్తముందన్న జగన్ నేడు అదే రిలయన్స్ అధినేతతో ఎలా సమావేశమయ్యారు? ముఖ్యమంత్రి ఇంట్లో మంత్రాంగం జరుగుతోందని రాష్ర్ట ప్రజలు భావిస్తున్నారు, వారిద్దరి భేటీలో జరిగిన క్విడ్ ప్రోకో బప్పందాలను జగన్ ప్రజలకు చెప్పాలి. వారికి రాజ్యసభ ఇస్తామన్నారా? అసలు ఇద్దరి మద్య జరిగిన ఒప్పందాలు ఏంటి? వారి బేటీ అంశాలను బయటికి చెప్పకుండా రహస్యంగా ఎందుకు ఉంచారు? పరిపాలనలో అంతా పారదర్శకంగా ఉండాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎవరితో భేటీ అయినా వెంటనే మీడియాకు వెల్లడించేవారు. కానీ జగన్ ఎందుకు వారి భేటీ అంశాలను బయటికి చెప్పటం లేదు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన భాద్యత ముఖ్యమంత్రిగా జగన్ పై ఉంది. నీతి మాటలు చెప్పే నైతిక ‍హక్కు జగన్ కి లేదు. జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు పర్యటనను అడ్డకున్న దానిపై జగన్ కి కోర్టు మొట్టికాయలు వేసినా ఆయన తీరు మారలేదు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్యుల సలహాలు కూడా పాటించారు. కానీ జగన్ ఎవరి సలహాలు స్వీకరించే స్ధితిలో లేరు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా మౌనం వీడి ముఖేష్ అంబానీతో బేటీలో చర్చించిన అంశాలను ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisements