టీడీపీ తరపున లోక్‌సభ ఎన్నికలకు పోటీచేసే 25 స్థానాలు, అసెంబ్లీ బరిలోకి దిగే 36 మంది అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. ఎంపీల జాబితాలో కొన్ని సంచలనాలు చోటుచేసుకున్నాయి. ఉండి ఎమ్మెల్యే శివరామరాజును నరసాపురం ఎంపీగా బరిలోకి దించారు. దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు ఎం.భరత్‌ను విశాఖ నుంచి, రాజమహేంద్రవరం సిటింగ్‌ ఎంపీ మురళీమోహన్‌ కోడలు మాగంటి రూపను అదే స్థానం నుంచి పోటీచేయిస్తున్నారు. నంద్యాల స్థానాన్ని గౌరు వెంకటరెడ్డి బావ మాండ్ర శివానందరెడ్డికి కేటాయించారు. మొత్తం 25 ఎంపీ స్థానాలకు, పది మంది సిట్టింగ్‌ ఎంపీలకు అవే స్థానాలు దక్కాయి. జాబితాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, నలుగురు కేంద్ర మాజీ మంత్రులున్నారు. రాజమహేంద్రవరం, అనంతపురంలో ప్రస్తుతం ఎంపీల వారసులకు టికెట్లు కేటాయించారు. జాబితాలో ఇద్దరు మహిళలకు ప్రాతినిథ్యం కల్పించారు. నలుగురు ఎస్సీలు, అయిదుగురు బీసీలు, ఒక ఎస్టీకి సీట్లు లభించాయి.

cbn 19032019 1

అసెంబ్లీకి :నెల్లిమర్ల-పతివాడ నారాయణస్వామి నాయుడు, విజయనగరం-అదితి గజపతిరాజు, భీమిలి-సబ్బం హరి, గాజువాక-పల్లా శ్రీనివాసరావు, చోడవరం-కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు, మాడుగుల -గవిరెడ్డి రామానాయుడు, పెందుర్తి - బండారు సత్యనారాయణ మూర్తి, అమలాపురం - ఐతాబత్తుల ఆనందరావు, నిడదవోలు - బూరుగపల్లి శేషారావు, నర్సాపురం - బండారు మాధవనాయుడు, పోలవరం - బొరగం శ్రీనివాసరావు, ఉండి- మంతెన రామరాజు, తాడికొండ - తెనాలి శ్రావణ్‌ కుమార్‌, బాపట్ల - అన్నం సతీశ్‌ ప్రభాకర్‌, నర్సరావుపేట- డాక్టర్‌ అరవింద్‌ బాబు, మాచర్ల - అంజిరెడ్డి, దర్శి - కదిరి బాబూరావు, నిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కావలి - విష్ణు వర్ధన్‌ రెడ్డి, నెల్లూరు రూరల్‌ - అబ్దుల్‌ అజీజ్‌, వెంకటగిరి - కె.రామకృష్ణ, ఉదయగిరి - బొల్లినేని రామారావు, కడప - అమీర్‌బాబు, కోడూరు - నరసింహ ప్రసాద్‌, ప్రొద్దుటూరు - లింగారెడ్డి, కర్నూలు - టీజీ భరత్‌, నంద్యాల - భూమా బ్రహ్మానంద రెడ్డి, కోడుమూరు-బి.రామాంజనేయులు, గుంతకల్లు- ఆర్‌.జితేంద్ర గౌడ్‌, శింగనమల-బండారు శ్రావణి, అనంతపురం అర్బన్‌ - ప్రభాకర్‌ చౌదరి, కల్యాణదుర్గం-ఉమామహేశ్వర నాయుడు, కదిరి- కందికుంట వెంకటప్రసాద్‌, తంబళ్లపల్లె- శంకర్‌ యాదవ్‌, సత్యవేడు- జేడీ రాజశేఖర్‌, గంగాధర నెల్లూరు-హరికృష్ణ, పూతలపట్టు - తెర్లాం పూర్ణం

cbn 19032019 1

ఎంపీ అభ్యర్థులు వీరే... శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విజయనగరం-అశోక్‌ గజపతిరాజు, అరకు-కిశోర్‌ చంద్రదేవ్‌, విశాఖపట్నం- ఎం.భరత్‌, అనకాపల్లి- ఆడారి ఆనంద్‌, కాకినాడ- చలమలశెట్టి సునీల్‌, అమలాపురం- గంటి హరీశ్‌మాధుర్‌, రాజమహేంద్రవరం- మాగంటి రూప, నరసాపురం - శివరామరాజు, ఏలూరు- మాగంటి బాబు, మచిలీపట్నం - కొణకళ్ల నారాయణరావు, విజయవాడ - కేశినేని శ్రీనివాస్‌ (నాని), గుంటూరు- గల్లా జయదేవ్‌, నరసరావుపేట- రాయపాటి సాంబశివరావు, బాపట్ల (ఎస్సీ) - శ్రీరాం మాల్యాద్రి, ఒంగోలు- శిద్దా రాఘవరావు, నెల్లూరు- బీద మస్తాన్‌రావు, తిరుపతి- పనబాక లక్ష్మి, చిత్తూరు- ఎన్‌.శివప్రసాద్‌, కడప- సీహెచ్‌ ఆదినారాయణరెడ్డి, రాజంపేట- డి.సత్యప్రభ, కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, నంద్యాల - మాండ్ర శివానంద్‌రెడ్డి, అనంతపురం- జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, హిందూపురం- నిమ్మల కిష్టప్ప

 

 

Advertisements