రాష్ట్రంలో ప్రజాస్వామ్యప్రక్రియ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం నడుస్తోందా... డీజీపీ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలోని పోలీస్ శాఖ ఉందా అనే అనుమానం తమతోపాటు ప్రజలందరిలోనూ ఉందని టీడీపీనేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులైన వర్లరామయ్య ప్రభుత్వంయొక్క దాష్టీ కాలు, జగన్ బాబు వైఫల్యాలను ఈ మధ్యన తరచూ ఎత్తిచూపుతున్నారన్నారు. వివేకా కేసు వ్యవహారంలో ఆయన్ని ఎవరు చం-పా-ర-ని, ఆయనకూతురు సునీతకు ఎందుకు న్యాయంజరగడంలేదని రామయ్య పదేపదే ప్రశ్నించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో రామయ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం, ఆయన్ని చం-పు-తా-మం-టూ బెదిరింపులకు దిగిందన్నారు. ముఖ్య మైన నాయకుడి హ-త్య సంగతి తేల్చకుండా పోలీస్ శాఖ, రాష్ట్రముఖ్యమంత్రి గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా అని టీడీపీసీనియర్ నేత ప్రశ్నిస్తే, ఆయన్ని చం-పు-తా-మ-న-డంపై డీజీపీ స మాధానం చెప్పాలన్నారు. వివేకానందరెడ్డిని ఎవరు చం-పా-రో తేల్చాలని, విచారణలో జాప్యం మంచిదికాదని, దోషులను పట్టుకోకుంటే, అది ప్రభుత్వచేతగానితనం కిందకువస్తుందని రామయ్య అడిగితే, ఆయన్నికూడా చం-పు-తా-మ-ని బెదిరింపు లకు దిగారన్నారు. రామయ్యఇంటికి ఫోన్ చేసి, ఇంట్లో ని కుటుం బసభ్యులతో అసభ్యంగా మాట్లాడారని మర్రెడ్డి తెలిపారు. పెరుమాళ రుషి అనేవ్యక్తి తన ఇంటికి ఫోన్ చేసి, ఇంట్లోవాళ్లను బెదిరించాడని, తనను చం-పు-తా-న-ని హెచ్చరించాడని రామయ్య నిన్నరాత్రి 9గంటలప్రాంతంలో భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, విజయవాడ సీపీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింద న్నారు. ఫోన్ చేసి బెదిరించినవారెవరో పట్టుకోవడం పో లీసులకు చేతకాదా అని మర్రెడ్డి నిలదీశారు.

రామయ్య ఫిర్యాదుచేసి, 24 గంటలు గడిచినా ఇంతవరకు బెదిరింపుకాల్ చేసిన వ్యక్తిని పట్టుకోలేకపోయారన్నారు. ఎల్ జీ పాలిమర్స్ పై సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ ను,ఎవరికో పంపిందని చెప్పి, రంగనాయకమ్మ అనే 65 ఏళ్ల ఆమెను, విచారణపేరుతో వేధించిన పోలీసులు, రామయ్యని చం-పు-తా-మ-ని ఫోన్ లో బెదిరించినవ్యక్తిని పట్టుకోలేకపో వడం సిగ్గుచేటన్నారు. రామయ్యకు వచ్చిన బెదిరింపు కాల్ నిపట్టించుకునే తీరిక, ఓపిక డీజీపీకి లేదా లేక వర్ల రామయ్య తమనుకూడా ప్రశ్నిస్తున్నాడని ఆయనపై వ్యక్తిగతంగా ఏమైనా మనసులో పెట్టుకున్నారా? రుషి పెరుమాళ అనేవ్యక్తి గుంటూరులోని భీమవరం వాసి అయినట్లు ఫేస్ బుక్ లోని తనఐడీ ద్వారా తెలుస్తోంద న్నారు. రుషి పెరుమాళ్లకు ఈ విధమైన బెదిరింపులకు పాల్పడేఉద్యోగం ఎవరిచ్చారో అతనే సమాధానంచెప్పా లన్నారు. రాష్ట్రంలోకి ఏవైనా ముఠాలు ప్రవేశించి అతనికి ఈ ఉద్యోగం ఇచ్చాయా అని మర్రెడ్డి నిలదీశారు. రుషి పెరుమాళ తల్లిదండ్రులు అతన్నికనిపెంచింది, ఇందుకేనా అన్నారు. అతని తల్లిదండ్రులు అతన్ని చది వించి, ఉద్యోగం చేసుకొని జీవించమంటే, వారి అంతు చూస్తాను... వీరి అంతుచూస్తాను అని బెదిరిస్తూ బతుకుతున్నాడన్నారు. అతనొక్కడే రామయ్య అంతు చూస్తాడా... రామయ్య అతని అంతుచూడలేడా అని శ్రీనివాసరెడ్డి బదులిచ్చారు.

జగన్ పాలనతో తనకు ఎలాగు భవిష్యత్ లేదని భావించిన రుషిపెరుమాళ ఈ విధమైన దారిలోకి వచ్చిఉండొచ్చని టీడీపీనేత అభిప్రాయపడ్డారు . జగన్ పాలన శాశ్వతంకాదని, భవిష్యత్ లో తెలుగు దేశంపార్టీ అధికారంలోకి వచ్చితీరుతుందని, రుషి పెరు మాళ వంటివారిని బాగుచేస్తుందని శ్రీనివాసరెడ్డి తెలిపా రు. రుషి పెరుమాళ ఫొటో తమకు దొరికిందని, త్వరలో నే అతని ఇంటికెళ్లి, అతని తల్లిదండ్రుల ముందే అతనితో మాట్లాడతామని, అవసరమైతే అతనిఇంటి ముందు ధర్నాకు దిగుతామని శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పా రు. రుషి పెరుమాళ చర్యలను అతని తల్లిదండ్రుల ఆమోదిస్తే, అతను ఇటువంటి పనులే చేసుకోవచ్చన్నా రు. మనంచేసే పనులు కనీసం మనకుటుంబానికి కూడా ఉపయోగపడకపోతే, ఇటువంటి బతుకులు బతకడం అనవసరమనే విషయాన్ని రుషి పెరుమాళ గ్రహించాలన్నారు. జగన్ తనకు ఇటువంటి ఉపాధి కల్పించాడనే ఆలోచనల్లోనుంచి రుషి పెరుమాళతో పాటు, సామాజికమాధ్యమాల్లో కించపరుస్తూ మాట్లాడేవారు, పిచ్చిపిచ్చి ట్రోల్స్ చేసేవారు అర్థం చేసుకోవాలన్నారు. డీజీపీ ఈ విధమైన వ్యక్తులపై చర్య లు తీసుకోవాలన్నారు. గతంలో రామయ్యకు సెక్యూరిటీ ఉండేదని, దాన్ని ఈ ప్రభుత్వం తొలగించిందన్నారు. 

Advertisements