పక్కా ఇళ్ల నిర్మాణాల్లో భారీ లక్ష్యం పెట్టుకున్న గృహ నిర్మాణశాఖ రెండో విడత సామూహిక గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారు చేసింది. జులై 5న మూడు లక్షల ఇళ్లకు ఒకేసారి సామూహిక గృహప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పూర్తిచేసుకున్న ఇళ్ల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎన్నికల నాటికి 10 లక్షల కొత్త ఇళ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందులో ఇప్పటి వరకు 4 లక్షల పైచిలుకు లక్ష్యాన్ని పూర్తి చేసింది. గతేడాది అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా తొలివిడతలో లక్ష ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు.

housing 30062018 1

అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తయిన మరో 3 లక్షల ఇళ్లకు ఇప్పుడు గృహప్రవేశాలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణశాఖ విజయవాడలో పెద్దఎత్తున సభ నిర్వహించనుంది. సీఎం చంద్రబాబు సభలో పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. మొత్తం 662 మండలాల్లోని 12,755 గ్రామ పంచాయతీలు, 119 పట్టణ ప్రాంతాల్లోని 2,073 వార్డుల్లో గృహప్రవేశాలు చేయించనున్నారు. గత అక్టోబరు నుంచి ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్ల సంఖ్య 3,00,306 ఉండగా, గృహప్రవేశాల రోజుకు ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని గృహనిర్మాణశాఖ అంచనా వేస్తోంది. కాగా, ఎన్నికల సమయానికి ఇంకా సుమారు 6లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

housing 30062018 2

ఇన్ని ఇళ్ళు, ఇంత మంది లబ్ధిదారులు ఉన్నా, ఎక్కడా రూపాయి అవినీతి ఉండదు.. ప్రతిపక్షాలకు ఇవి అబద్ధం అని చెప్పే అవకశం ఉండదు. ఈ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా సాగుతుంది. ఎక్కడా రూపాయి అవినీతికు తావు ఉండదు. మొత్తం డబ్బులు బ్యాంకు ఎకౌంటు లో పడతాయి. అంతే కాదు, మొత్తం ప్రక్రియ అంతా, ప్రతి స్టేజ్ రియల్ టైం లో ఆన్లైన్ లో ఉంటుంది. మీరు చూడండి... పైసా అవినీతి లేకుండా, పేద వాడికి ఎలా లబ్ది చేకురుస్తున్నారో...ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in//NTRNutanaGruhaPravesam.do ఇక్కడ మీ జిల్లా, ఊరు సెలెక్ట్ చేస్తే, మీ ఊరిలో ఎవరికి ఈ ఇల్లు ఇచ్చారు... వారి పేరు, గృహప్రవేశం చేసిన ఫోటోలు వస్తాయి... మరిన్ని ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in/gruhapravesaluReport.do . ఇలా ప్రక్రియ అంతా ఆన్లైన్ లో ఉంటుంది. అవినీతి అనే ఆస్కారం అసలు ఉండదు.

Advertisements