తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన ప్రదేశమని, ప్రపంచంలోని హైందవులందరికీ అతిపవిత్రమైనదని, ఇప్పటికీ కోట్లాదిమంది భక్తులు స్వామివారిని చూసి తరిస్తుంటారని, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జా తీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనేక్లుప్తంగా మీకోసం... పిలిస్తే పలికేదేవుడిగా, కులదైవంగా శ్రీ వేంకటేశ్వరస్వా మి విరాజిల్లుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల వైభవం, ప్రాభవం, ప్రాశస్త్యం మసకబారుతోందని చాలా బాధాతప్తహృద యంతో చెబుతున్నాను. గతంలో ప్రధానార్చకులుగా చేసి, రిటైరైన రమణదీక్షితు ల్ని, మరలా ప్రధాన అర్చకులుగా జగన్మోహన్ రెడ్డి 6వ తేదీన నియమించారు. మతపరమైన ఆచారాలతో ఆటలాడకూడదని జగన్మోహన్ రెడ్డికి తెలియచేస్తున్నా ఎందుకంటే అటువంటి వ్యవహారాలపై ఆయనకు ఆట్టే అవగాహనలేదుకాబట్టి, నేను చెబుతున్నాను. రమణ దీక్షితులు వివాదాస్పదమైన వ్యక్తి. ఆయన వైఖరి, భాష ప్రతీది వివాదాస్పదమే. ఆయన భగవంతుడికి సేవచేస్తు న్నట్లుగా కనపడరు. కొంతమంది వ్యక్తులకు సేవచేస్తు న్నట్లుగా అనిపిస్తుంది. భగవంతుడికి సేవచేస్తున్న మనిషిలా ఆయన కనిపించరు. స్వామివారి వైభవానికి, తిరుమలతిరుపతి దేవస్థానం ప్రాశస్త్యానికి దెబ్బతగిలే రీతిలో ఆయన గతంలో కొన్నివ్యాఖ్యలుచేశాడు. పింక్ డైమండ్ గురించి ఆయనకు అవగాహనలేకున్నా, తెలి యకపోయినా, ఏ2 విజయసాయిరెడ్డికి మద్ధతిస్తూ, రమణదీక్షితులు మాట్లాడారు. అదికూడా చెన్నైలో, ఢిల్లీ లో మాట్లాడారు. స్వామివారి ఔన్యత్యానికి, ప్రాశస్త్యానికి, దెబ్బతగిలే మాటలు మాట్లాడాడు. స్వామివారి వైభవం మసకబారే మాటలు వేరేరాష్ట్రాల్లో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై ఆనాడున్న పాలకమండలి బాధపడింది.

పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లోఉంది, కరకట్ట తవ్వితే బయటపడుతుందన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు, రమణ దీక్షితులు మద్థతుపలికాడు. దానివల్ల స్వామి వారి ఔచిత్యానికి, ఔన్నత్యానికి, ప్రాభవానికి ఎంత భంగం కలుగుతుందండీ? పింక్ డైమండ్ఉంటే అది, స్వామివారి ఇంట్లో ఉండాలి. సీబీఐ నేరస్థుడని ముద్ర వేసినవ్యక్తి, 11కేసుల్లో ముద్దాయిగా ఉన్నవ్యక్తి, మాట్లా డిన మాటలకు మద్ధతుపలకడమేంటి? ప్రధాన అర్చకు డిగా స్వామివారి పక్షాన నిలవాల్సిన వ్యక్తి, ఆలయ ఔచి త్యాన్ని కాపాడాల్సినవ్యక్తి ముద్దాయిలపక్షాన వారితో గొంతుకలిపాడు. దేవస్థానం వైపు నిలబడాల్సిన వ్యక్తి, పేరెన్నికగన్న ముద్దాయిలకు మద్ధతుపలికాడు. ఆనా డు వారుచేసినవ్యాఖ్యలపై బాధపడిన పాలకమండలి, టీటీడీపెద్దలు, ప్రభుత్వం, ప్రశ్నార్థకమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి, అఖిలాండకోటి బ్రహ్మాండనాయ కుడి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉండటానికి వీల్లే దని నిర్ణయించారు. ఎంతోమంది భక్తులసూచనలు, సల హాల ప్రకారం 65ఏళ్లు నిండిన రమణదీక్షితుల్ని తొలగిం చడం జరిగింది. ఆనిర్ణయంపై ఆనాడు హైందవలోకమం తా హర్షం వ్యక్తంచేసింది. దానితోపాటు, 2018 –మే లో పేరెన్నికగన్న నేరస్థుడైన విజయసాయిరెడ్డితోపాటు, రమణ దీక్షితులు రూ.200కోట్లను పరువునష్టంకింద ధరావతుగా చెల్లించడం జరిగింది. అధికారమిచ్చింది ఇష్టమొచ్చినట్లు వ్యవహారించడానికికాదు. ముఖ్యమం త్రి గారు నా ప్రెస్ మీటు వినాలి. ఏ2, రమణదీక్షితుల వ్యాఖ్యలవల్ల స్వామివారి పవిత్రత, ఔచిత్యం దెబ్బతిన్నదని తిరుపతి పదోఅదనపు జిల్లా కోర్టులో పరువునష్టం దావావేశారు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అదృష్టమో, దురదృష్టమో జగన్మోహ న్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో, విజయసాయిరెడ్డి ఎప్పుడైతే రాష్ట్రంలో చక్రం తిప్పడం మొదలెట్టారో అప్పుడు రమణ దీక్షితులకి ఒకబలం వచ్చింది. ఊతం లభించింది.

మొన్నటివరకు పరువునష్టం దావా ఎదుర్కొంటూ తిరి గినవ్యక్తికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక బలం వచ్చింది. ఆ బలం ఎంతవరకు వచ్చింది. పరువునష్టం దావాలో ముద్దాయిగా ఉన్న రమణదీక్షితుల్ని ప్రధాన అర్చకుడిగా ఈ ప్రభుత్వం నియమించడం ఎంత శోచనీ యమండీ... ఎంత బాధాకరమండీ? స్వామివారి పరు వుకి భంగం కలిగించిన ముద్దాయిని ప్రధాన అర్చకుడి గా నియమిస్తారా? ముఖ్యమంత్రి క్రైస్తవుడు కనుక, హైందవసంప్రదాయంపై ఆయనకు ఆట్టే అవగాహన లేదు కనుక, రమణదీక్షితులు తనతో, తనతోటి ముద్దా యిలతో బాగుంటాడు కనుక, ఒకఆర్డర్ వేసి, ఆయన్ని ప్రధాన అర్చుకుడిగా నియమించారు. చట్టబద్ధంగా, ధర్మ బద్ధంగా ఆయన్ని నియమించలేదు. ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందనేసూక్తితో స్వామివారి సేవలు నడుస్తుంటాయి. రమణదీక్షితుల్ని తిరిగి నియమించడం ధర్మాన్నికాపాడినట్టా? స్వామి వారి ఔచిత్యాన్ని కాపాడినట్టా? హైందవ మతానికి సం బంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి ఆలోచించకుం డా నిర్ణయం తీసుకున్నారు. ఏ హైందవమతపెద్దలను, ఏ పీఠాధిపతులను, ఏ జీయర్ స్వాములను సంప్రదించి ముఖ్యమంత్రి, రమణదీక్షితులి విషయంలో నిర్ణయం తీసుకున్నారు? ముఖ్యమంత్రిది హైందమతంకాదు, ఆ మతం ఆచారవ్యవహారాలు ఆయ నకు తెలియవు. మరి అలాంటప్పుడు ఎవరిని సంప్రదిం చి ఈనిర్ణయం తీసుకున్నారు. స్వామివారి ప్రాశస్త్యాన్ని తక్కువచేసిన వ్యక్తి, స్వామివారి గౌరవం మసకబారేలా వ్యవహరించిన వ్యక్తి, స్వామివారి పరువుతీశాడని, దేవ స్థానంవేసిన పరువునష్టం కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, తోటి ఏ2కు సహకరించాడని ప్రధాన అర్చకత్వం కట్టబెట్టారా? దీనిపై ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి.

తనను ప్రధాన అర్చకుడిగా నియమించగానే, రమణ దీక్షితులు చెంగుచెంగున గెంతుకుంటూ వెళ్లి ముఖ్య మంత్రిని కలిశాడు. స్వామివారి ప్రసాదం అందించాడు. దాన్ని ఆయన పక్కనున్న టేబుల్ పై పెట్టారు. రమణ దీక్షితులు, ముఖ్యమంత్రిని కలిసి, పెద్దబొకే ఇచ్చి, శాలువాకప్పి, బయటకువచ్చాక ఏమన్నాడండీ .. సీఎం జగన్ విష్ణుమూర్తికి ప్రతిరూపమని అభివర్ణిం చారు.... అంతకంటేఘోరం ఇంకోటి ఉందా? హైందవ మత పెద్దలారా..జీయర్ స్వాములారా... పీఠాధిపతులా రా.. విశాఖపట్నంలోని ఆస్వామీజీ రమణదీక్షితులి వ్యాఖ్యలపై ఏమంటారు? క్రైస్తవ మతాన్ని ఆచరించే జగ న్మోహన్ రెడ్డి, వేంకటేశ్వరస్వామికి ప్రతిరూపమా? ఎంత పొగరుంటే దీక్షితులుమహాశయుడు అలా అంటాడు? అనేకకేసుల్లో ముద్దాయిగా ఉన్నవ్యక్తి, ప్రశ్నార్థకమైన జీవితం గడుపుతున్నవ్యక్తి, ప్రతిశుక్రవారం కోర్టుకి హజ రయ్యే వ్యక్తి, విచారణ సక్రమంగా జరిగితే జైలుకు పోతాడో.. ఇంట్లో ఉంటాడో తెలియని వ్యక్తిని విష్ణుమూర్తి తో పోలుస్తారా? ప్రధానార్చకులు రమణ దీక్షితులు, క్రైస్త వమత ఆరాధకుడైన జగన్మోహన్ రెడ్డిని విష్ణుమూర్తితో పోల్చి, సీఎంజగన్ విష్ణుమూర్తి ప్రతిరూపమంటే, అలా అనవద్దని ముఖ్యమంత్రి ఎందుకు అనలేదు? రమణ దీక్షితులి వ్యాఖ్యలపై పీఠాధిపతులు, జీయర్ స్వాము లు, విశాఖస్వామీజీ ఏం సమాధానంచెబుతారు? మనిషిని దేవుడితో పోల్చడం సబబేనా? సమంజసమే నా?

 

Advertisements