కేంద్రప్రభుత్వ నిధుల్ని వైసీపీ ప్రభుత్వం తనపార్టీ కార్యకర్తలు, నాయకులకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతోందని, గతప్రభుత్వంలో ఉపాధిహామీపథకం కిందపనులు చేసినవారికి అందాల్సిన సొమ్ముని దారిమళ్లించి, తమపార్టీవారికి దోచిపెట్టే క్రతువుకు జగన్‌సర్కారు తెరలేపిందని టీడీపీనేత, ఎమ్మెల్సీ వై.వీ.బీ.రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీకేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. పంచాయతీభవనాలు, అంగన్‌వాడీభవనాలు, పాఠశాలలకు, సచివాలయాలు, చిట్టచివరకు చెత్తకుండీలు, శ్మశానాలకు పార్టీరంగులేసిన జగన్‌సర్కారుకి హైకోర్టు నిర్ణయం చెంపపెట్టువంటిదన్నారు. రాష్ట్రప్రభుత్వం రంగులేయడానికే రూ.1300కోట్లు ఖర్చు చేసిందన్నారు. వైసీపీ రంగులేయడానికి రూ.1300కోట్లుఖర్చయితే, కోర్టు ఆదేశాలతో అవితొలగించడానికి తిరిగి మరో రూ.1300కోట్లు ఖర్చవుతుందని, మొత్తం గా రూ.2,600కోట్ల ప్రజాధనాన్ని వైసీపీప్రభుత్వం దుర్వినియోగంచేసిందని వై.వీ.బీ పేర్కొన్నారు. మండలినిర్వహణకు రూ.60కోట్లు ఖర్చవుతుందని గగ్గోలుపెట్టిన జగన్‌, తనపార్టీ రంగులకోసం ఖర్చుచేసిన రూ.2,600కోట్లను తనసొంత నిధుల్లోంచి చెల్లిస్తారా అని టీడీపీనేత ప్రశ్నించారు. తాను అక్రమంగా సంపాదించిన సొమ్ములోంచి ఆమొత్తాన్ని మినహాయించాలన్నారు.

రాజ్యాంగవిరుద్ధంగా గ్రామపంచాయతీలు, మండలపరిషత్‌ భవనాలకు, పాఠశాలలకు రంగులు వేయడంజరిగిందన్నారు. గ్రామపంచాయతీ భవనాలు గ్రామంలో నివసించే ప్రజలందరివీ అని, వాటికి పార్టీ రంగులేయడానికి వైసీపీప్రభుత్వానికి ఏం అధికారముందన్నారు. ఏపార్టీ అధికారంలోఉంటే, ఆపార్టీ రంగులేస్తూపోతే, అలాంటిచర్యలకు అంతూపొంతూ ఉండదన్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు అత్యుత్సాహంతో రోడ్లవెంబడి ఉన్నచెట్లకు కూడా వైసీపీరంగులు వేశారన్నా రు. హైకోర్టుఆదేశాలతో రంగులు మార్చడానికి అవసరమయ్యే నిధుల్ని జగన్‌ జేబులో నుంచే తీసి ఖర్చుపెట్టాలని వై.వీ.బీ డిమాండ్‌చేశారు. టీడీపీ హాయాంలో ఉపాధిహామీపథకం కింద చేసిన అభివృద్ధిపనుల తాలుకా రూ.,2500 కోట్ల నిధులు ఇవ్వకుండా వైసీపీప్రభుత్వం ఇప్పటివరకు వేధించుకుతిందని, దానిపై కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. పాతబకాయిలు రూ.2,500కోట్లు ఇవ్వకుండా, కేంద్రం విడుదలచేసిన రూ.1700కోట్లను జగన్‌సర్కారు తనసొంతపథకా లకు వినియోగించుకుంటోందన్నారు.

ఇళ్లస్థలాల చదునుకు ఎకరాకు రూ.కోటి, ఒక్కోసచివాలయం నిర్మాణానికి రూ.50లక్షల చొప్పున కేటాయించారని టీడీపీనేత తెలిపారు. గతప్రభుత్వంలో పనులుచేసిన వారికి అందాల్సిన నిధుల్ని పందికొక్కుల్లా మింగేయడానికి వైసీపీకార్యకర్తలు, నేతలు ఇప్పటికే సిద్ధమైపోయారని రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు.గ్రామ,మండల, నియోజకవర్గస్థాయిలో ఉండే వైసీపీ నేతలు, కార్యకర్తలకు కూడా భవిష్యత్‌లో తమకు పట్టినగతే పడుతుందని, ఇప్పుడు వారు చేస్తున్నపనులకు నిధులు రాకుండా తాము కేంద్రానికి ఫిర్యాదుచేస్తామని వై.వీ.బీ. హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పారనే అత్యుత్సాహంతో పనులు చేసేవారంతా ఈ విషయా న్ని గుర్తుంచుకుంటే మంచిదన్నారు. మండలినిరద్దు చేసి, తమపదవులుపోగొట్టి, తమను ప్రజలపక్షాన నిలిపి, పదవుల్ని త్యాగంచేసే అవకాశం కల్పించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు వై.వీ.బీ అభిప్రాయపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read