వైసీపీ ఓట్లు పొందాలంటే కోడిక‌త్తి దాడి. సీట్లు ఇంకా ఎక్కువ రావాలంటే బాబాయ్‌పై గొడ్డ‌లి వేట్లు. ఇప్పుడు అధికారం అండ‌గా సాగిస్తున్న అవినీతి ప్ర‌శ్నించ‌కుండా రోజుకొక‌రిపై దాడులు. ఇదే వైకాపా గెలుపు మంత్రం. బెదిరింపు సూత్రం. విప‌క్షం ఏదైనా కానీయండి. ప్ర‌శ్నిస్తే ప్ర‌భుత్వం నుంచి దాడులే ఎదుర‌వుతున్నాయి. టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డిపై వైకాపా రౌడీమూక‌లు హ‌త్యాయ‌త్నానికి ఆయ‌న ఇంటిపైనే ఎటాక్ చేయ‌డం రాష్ట్రంలో ప‌రిస్థితుల‌కి అద్దం ప‌డుతోంది. అంత‌కు రెండురోజుల‌కి ముందే యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో లోకేష్‌పై ఎటాక్‌కి య‌త్నించారు. కోడిగుడ్లు విస‌ర‌డంతో లోకేష్ భ‌ద్ర‌తాసిబ్బంది అడ్డుగా నిలిచారు. టిడిపి జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిపై ఇప్ప‌టికే మూడుసార్ల‌కి పైగా హ‌త్యాయ‌త్నాల‌కి తెగ‌బ‌డ్డారు. పుంగ‌నూరులో ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేసే ర్యాలీకి దిగిన రామ‌చంద్ర‌యాద‌వ్ అనే నాయ‌కుడు ఇంటిని నామ‌రూపాల్లేకుండా ధ్వంసం చేశారు వైకాపా గూండాలు. మాచ‌ర్ల‌లో టిడిపి నేత జూల‌కంటి బ్ర‌హ్మారెడ్డిని అడ్డుకునేందుకు ఇప్ప‌టికే ఆయ‌న అనుచ‌రులు చాలా మందిని మ‌ట్టుబెట్టిన వైసీపీ, ఇటీవ‌ల టిడిపి నేత‌ల ఇళ్ల‌పై దాడుల‌కి దిగి,  టిడిపి కార్యాల‌యాన్ని త‌గుల‌బెట్టారు. గ‌న్న‌వ‌రంలో టిడిపి ఆఫీసుని ధ్వంసం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తీరోజూ రాష్ట్రంలో ఏదో ఒక మూల టిడిపి ల‌క్ష్యంగా వైసీపీ మూక‌లు విధ్వంసాల‌కి దిగుతూనే ఉన్నాయి.

Advertisements