వైసీపీ శైలి ప్ర‌మాద‌క‌ర ఎత్తుగ‌డ‌ల‌కి తెర‌తీసింది. ప్ర‌శాంతంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ని సైతం అల్ల‌క‌ల్లోలం చేసే వ్యూహం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కి దారి తీస్తోంది. రాజ‌కీయ పార్టీలు ఎవ‌రికి వారు త‌మ కార్య‌క్ర‌మాలు చేసుకోవ‌డం ఆన‌వాయితీ. ప్ర‌భుత్వం తాము చేసింది ప్ర‌చారం చేసుకుంటుంది. ప్ర‌తిప‌క్షం స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతుంది. ఇవి వివిధ‌మార్గాల ద్వారా చేస్తారు. అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌జాస్వామ్యంలోనే చాలా డేంజ‌ర్ పోక‌డ‌ని మొద‌లుపెట్టింది. ప్ర‌జాధ‌నంతో ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి అందులో విప‌క్షాల‌పై ఆరోప‌ణలు గుప్పించ‌డంతో వార్‌కి తెర‌తీసింది. టిడిపి బీసీ స‌ద‌స్సు పెడితే, అంత‌కు ముందే బీసీల‌కి టిడిపి అన్యాయం చేసింద‌ని వాల్ రైటింగ్స్‌, ఫ్లెక్సీలు క‌ట్ట‌డం వైసీపీ న‌యా క‌న్నింగ్ పాలిటిక్స్. మ‌హానాడు కోసం టిడిపి అంగ‌రంగ వైభ‌వంగా ఏర్పాట్లు చేసుకుంటే..ప‌సుపు జెండాలు ఫ్లెక్సీల మ‌ద్య‌లో వైసీపీ ఫ్లెక్సీలు వేశారు. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి యువ‌గ‌ళం పాద‌యాత్రలో నారా లోకేష్‌ ఏ ఊరు వెళితే ఆ ఊరిలో పేద‌ల కోసం జ‌గ‌న్ రాక్ష‌సుల‌తో యుద్ధం చేస్తున్నాడంటూ రాముడి పోజులో జ‌గ‌న్ రెడ్డిని పెట్టి భారీ ఫ్లెక్సీలు క‌డుతున్నారు. చంద్ర‌బాబు నుంచి నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి ప‌ర్య‌టించినా అక్క‌డ ఈ ఫ్లెక్సీల‌తో వైసీపీ క‌వ్విస్తోంది. టిడిపి కూడా ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు. ప్ర‌జాధ‌నం దోపిడీ చేసిన దొంగ‌పై చంద్ర‌న్న యుద్ధం, పేద‌ల‌పై పెత్తందారుడైన జ‌గ‌న్ చేస్తున్న దౌర్జ‌న్యాల‌ని అడ్డుకుంటామంటూ టిడిపి ఫ్లెక్సీలు వేస్తోంది. వైసీపీ ఫ్లెక్సీల జోలికెళ్ల‌ని పోలీసులు, టిడిపివి మాత్రం పీకేస్తున్నారు. దీంతో రాష్ట్ర‌మంతా ఉద్రిక్త‌త‌లు నెల‌కొంటున్నాయి. వైసీపీ క‌వ్వింపు చర్య‌లు, పోలీసుల ప‌క్ష‌పాత వైఖ‌రితో ఫ్లెక్సీ వార్ తీవ్రం అవుతోంది.

Advertisements