కోయంబత్తూరులో ఉన్న యోగా గురువు సద్గురు జగ్గీవాసుదేవన్ ఈషా యోగా కేంద్రంలో జరగనున్న మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం కోయంబత్తూరు వస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన 112 అడుగుల ఎత్తయిన ఆదియోగి మహాశివుని విగ్రహాన్ని మోదీ ప్రతిష్ఠించనున్నారు.

ఈ వేడుకల్లో పాల్గునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోయంబత్తూరు వెళ్తారు. ఈ వేడుకల్లో తమిళనాడు రాష్ట్ర ఇనచార్జ్‌ గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగరరావు, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొననున్నారు.

Advertisements