ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ''మీరు చేసిన త్యాగానికి ఏం చేసినా తక్కువే'' అమరావతికి భూములు ఇచ్చిన ప్రజలనుద్దేశించి ఎప్పుడూ చేసే వ్యాఖ్య ఇది. ప్రతి విషయంలోనూ, రాజధాని ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటూ, అండగా ఉంటూ, వాళ్ళ త్యాగానికి సరైన గుర్తింపు ఇచ్చి, వారికి భరోసా ఇస్తూనే ఉన్నారు. ఆ కోవలోనే, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన గ్రామాలకు చెందిన యువతకు ప్రభుత్వం వివిధ రంగాల్లో వృత్తి విద్యలో శిక్షణ ఇస్తుంది. అమరావతి నగర పరిధిలోని 27 రెవెన్యూ గ్రామాల్లోని యువతీ యువకుల్లో నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవల్పమెంట్)ను పెంచేందుకు ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీఆర్డీఏ సంయుక్తంగా ఈ శిక్షణ ఇప్పిస్తుండడం, ఇప్పటికే దీనికింద వివిధ కోర్సుల్లో పలువురు శిక్షణ పొంది, జీవనోపాదికి బాటలు వేసుకోవడం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి లభిస్తున్న స్పందన దృష్ట్యా మలిదశ శిక్షణకు అధికారులు సంకల్పించారు. మంగళగిరి మండలంలోని నవులూరులో ఏర్పాటు చేసిన అమరావతి స్కిల్ డెవల్పమెంట్ ఇనస్టిట్యూట్లో ఈ శిక్షణ ఇస్తారు. పూర్తి ఉచితంగా ఇచ్చే ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఎటువంటి స్టైపండ్ చెల్లించబోమని, ఈ శిక్షణ రాజధాని నగర పరిధిలోని 27 గ్రామాలకు చెందిన యువతీ యువకులకు మాత్రమేనని సీఆర్డీయే కమిషనర్ సీహెచ్ శ్రీధర్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమ గ్రామాల్లోని సీఆర్డీయే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయంలో లేదా గ్రామ ఫెసిలిటేటర్ లేదా 95057 19172, 97000 25833 ఫోన నెంబర్లలో కానీ సంప్రదించవచ్చునన్నారు. శిక్షణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అన్ని కోర్సులకూ వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 40గా నిర్ణయించారు. అయితే వాటి కాలవ్యవధి, విద్యార్హతలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి.
కోర్సులు ఇవీ...
- కోర్సుల్లో విద్యార్హతలతో నిమిత్తం లేకుండా ఆసక్తి ఉన్న రాజధాని వాసులెవరైనా శిక్షణ పొందవచ్చు
- మొబైల్ టెక్నీషియన (45 రోజులు)
- ఏసీ టెక్నీషియన (2 నెలలు)
- కారు డ్రైవర్ (20 రోజులు)
- బ్యుటీషియన (30 రోజులు)
- స్కూటర్ మెకానిక్ (3 నెలలు)
4 నెలలపాటు శిక్షణ కొనసాగే ల్యాండ్ సర్వేయర్ కోర్సుకు 10వ తరగతి, ఆపైన చదివి ఉండాలన్న అర్హత విధించారు
3 నెలలు ట్రైనింగ్ జరిగే ల్యాబ్ టెక్నీషియన కోర్సు అభ్యసించేందుకు ఇంటర్ (బైపీసీ) చదివిన వారు అర్హులు
శిక్షణ కాలం 2 నెలలుండే అకౌంటెన్సీలో ఇంటర్ (సీఈసీ), బీకాం, ఎంకాం, ఎంబీఏ (ఫైనల్) చదివిన వారు చేరవచ్చు