దర్శకరత్న దాసరి నారాయణరావును, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌తో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని, చంద్రబాబు శుక్రువారం పరామర్శించారు. దాసరి ఆరోగ్య పరిస్థితిని కిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

దాసరి ఆరోగ్యంగా ఉన్నారని, ఆప్యాయంగా పలకరించారని, రెండు రోజుల్లో దాసరి మామాలు స్థితికి వస్తారని చంద్రబాబు వెల్లడించారు. దాసరి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడాలని ఆకాంక్షించారు.

Advertisements