ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివం అంటే చైతన్యమని, శివుడి నుంచే యోగ సంప్రదాయం వచ్చిందని తరతరాల విశ్వసమని గుర్తు చేశారు. శివతత్వం అనుసరణీయమని చంద్రబాబు అన్నారు. అభిషేకప్రియుడైన శివుడు ఆది దేవుడని, కోరిన వరాలిచ్చే బోళాశంకరుడని ఆయన అభివర్ణించారు.

రాష్ట్రంలోని శక్తిపీఠాలు, పంచారామాలు, భక్తుల హర హర మహాదేవ ఘోషలతో మారుమోగే రోజు మహాశివరాత్రి అని చంద్రబాబు చెప్పారు. శివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు శివరాత్రి అని, లోక కల్యాణం కోసం గరళకంఠుణ్ణి ఆనందంగా ఉంచేందుకు భక్తులు జాగరూకులై జాగరణతో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Advertisements