ఏసుక్రీస్తు శాంతి బోధనలతో ప్రపంచాన్నే ప్రభావితం చేశారని, ఆయన త్యాగానికి ప్రతీక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన క్రైస్తవులకు సందేశమిచ్చారు. క్రీస్తుకు శిలువవేసిన రోజును గుడ్ ఫ్రైడేగా పాటిస్తున్నారని, ఇది ఎంతో పవిత్రమైన రోజని చెప్పారు.

క్రీస్తు శాంతిదూతగా లోకానికి వచ్చారన్నార ు. కాలాన్ని గణించటంలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా పాటించటం గమనించదగిన అంశమన్నారు. శాంతి, అహింస తోనే సమాజాభివృద్ధి సాధ్యమని, విశ్వమానవాళిని ప్రేమతో చూడాలన్నదే కరుణామయుని బోధనల సారమని చంద్రబాబు గుర్తు చేశారు. సత్యం, త్యాగం, శాంతి, సౌభాతృత్వాలతొ మానవాళి మెలిగితే క్రీస్తు ఆశీస్సులుంటాయని చంద్రబాబు అన్నారు.

Advertisements