బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజే, కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి పై భారం మోపింది. వంట గ్యాస్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బారీగా పెరిగిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. అన్ని గ్యాస్‌ కంపెనీలకు పెరిగిన ధరలు వర్తిస్తాయి.

గృహావసరాలకు సంబంధించిన వంట గ్యాస్‌ 14.2 కిలోల సిలిండర్‌ (డొమెస్టిక్‌)పై రూ. 71.5 కాగా కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.110.5 వరకు పెరిగింది. రూ. 663.00 ఉన్న గ్యాస్, 734.50 పెరగటంతో, ఒకే సారి రూ. 71.5 పెరగటంతో వినియోగదారులపై భారం పడనుంది.

Advertisements