ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో ఉన్న వింత వింత పరిస్థితిలు ఎక్కడా ఉండవు. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ఏకంగా జడ్జిలను కూడా టార్గెట్ చేస్తారు. ఇదేమీ దాచాల్సిన విషయం కూడా కాదు. ఎందుకుంటే ఏకంగా జగన్ మోహన్ రెడ్డి, నేను పలానా జడ్జిల పై కంప్లైంట్ ఇచ్చానని, ఏకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే చెప్పించారు. తెలుగువారైన ఒక సుప్రీం కోర్టు జడ్జి, రేపు చీఫ్ జస్టిస్ అయితే, తన కేసులు విషయంలో ఏదో చేసేస్తారని, ఇప్పుడే భయపడి పోయి, ఆ సుప్రీం కోర్టు జడ్జిని టార్గెట్ చేయటానికి, అధికార పార్టీ చేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. ఒక పక్క ఇప్పటికీ ఆ సుప్రీం కోర్టు జడ్జి పై, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసారు. అయితే మరో రకంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాట్టు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మొన్నా మధ్య ఒక కేసు హైలైట్ అయ్యింది. సుప్రీం కోర్టు జడ్జికి సంబందించిన వివరాలు తీసుకుని, తన దగ్గరకు రావాలని, అతని సంగతి చూస్తాను అనే విధంగా, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య అలాగే వైసీపీ నేతలు వేధిస్తున్న జడ్జి రామకృష్ణ ఫోన్ సంభాషణలు బయటకు వచ్చాయి.

అయితే ఈ విషయం మళ్ళీ కోర్టుకు చేరుకుంది. జడ్జిల పై కుట్ర పన్నే విధంగా, జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహరించారు అంటూ, జడ్జి రామకృష్ణ హైకోర్టులో కేసు వేసారు. అయితే, దీని పై స్పందించిన హైకోర్టు, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. దీని పై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని ఆదేశించింది. అయితే దీని పై జస్టిస్ ఈశ్వరయ్య, సుప్రీం కోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలుపుదల చేయాలని కోరారు. ఈ కేసుని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డితో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. తన వాయిస్ ని మార్చారు అంటూ ఈశ్వరయ్య వాదించారు. అయినా తాను ఏమి కుట్రలు పన్నలేదని, బయట ప్రచారంలో ఉన్నవే చెప్పానని అన్నారు. అలాగే జడ్జి రామకృష్ణ తరుపు న్యాయవాది స్పందిస్తూ, మొత్తం ఆడియో మీ ముందు ఉంచాం అని, ఇందులో ఎడిట్ చేయటానికి ఏమి ఉంటుంది, అది తప్పుడు ఆరోపణ అంటూ తోసిపుచ్చారు. ఇరువరి వాదనలు విన్న కోర్టు, ఈ పిటీషన్ పై వాదనలు ముగిసాయని, అఫిడవిట్ లు పరిశీలించి, తుది తీర్పు చెప్తాం అని, కేసు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది.

Advertisements