ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నివాసం వద్ద కొండచిలువ కలకలం రేపింది. ప్రకాశం బ్యారేజీ దాటాక కరకట్ట మీద నుంచి సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో దీన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించే మార్గంలో రోజూ బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేస్తుంటాయి. ఈ ఉదయం కూడా కరకట్టకు ఇరువైపులా భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తున్నప్పుడు ఆరడుగుల కొండచిలువను వీరు గుర్తించారు. ఆరడుగుల కొండచిలువ అప్పటికే, ఒక కోడిని పట్టింది.

సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది కొండచిలువను పట్టుకుని మంగళగిరి కొండప్రాంతానికి తరలించారు. ఇదే మార్గంలో మరో 10 అడుగుల కొండచిలువ కూడా తిరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.

Advertisements