బెజవాడలో భానుడి వేడికి, ప్రజలు అల్లాడిపోతున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్ధం ఆర్టీసీ అధికారులు మొదటిసారిగా అరైవల్ బ్లాక్లో జంబో కూలర్లను ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బషీర్ అహ్మద్ తెలిపారు.

శనివారం మధ్యాహ్నం సంస్థ ఎండీ ఎం. మాలకొండయ్య వాటిని ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా అరైవల్ బ్లాక్లోని 51 - 57 ప్లాట్ఫారంల మధ్య జంబో కూలర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

విజయవంతమైతే అన్ని ప్లాట్ఫారంలలో ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.

Advertisements