రాష్ట్రంలో ఎయిర్ ఇండియా నాలుగు కొత్త విమాన సర్వీసులు నడపనుంది. ఒక్క బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు ఈ కొత్త విమాన సర్వీసులు నడుస్తాయి.

కొత్త సర్వీసుల వివరాలు :
1) వైజాగ్ లో ఉదయం 06.30 గంటలకు బయలుదేరే AI 9527 విమాన సర్వీసు విజయవాడ మీదుగా ఉదయం 09.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి AI 9528 సర్వీసు విమానం ఉదయం 09:25 గంటలకు తిరుపతిలో బయలుదేరి విజయవాడ మీదుగా ఉదయం 11 గంటల 55 నిమిషాలకు వైజాగ్ చేరుకుంటుంది.
2) వైజాగ్ లో మధ్యాహ్నం 12.40 గంటలకు బయలుదేరే AI 9533 విమాన సర్వీసు భువనేశ్వర్ కు మధ్యాహ్నం 01.05 గంటలకు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 02.30 గంటలకు భువనేశ్వర్ లో బయలుదేరి మధ్యాహ్నం 03.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.

3) వైజాగ్ లో సాయంత్రం 04.35 గంటలకు బయలుదేరే AI 9535 విమాన సర్వీసు రాయ్ పూర్ కు సాయంత్రం 06.00 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 06.25 గంటలకు రాయ్ పూర్ నుంచి బయలుదేరి రాత్రి 08.00 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.
4) వైజాగ్ లో ఉదయం 10.45 కు బయలుదేరే AI 9537 విమాన సర్వీసు విజయవాడ మీదుగా మధ్యాహ్నం 01.10 గంటలకు హైద్రాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీసు ఒక్క బుధవారం మాత్రమే నడపుతారు.

 

Advertisements